Movie News

ఇదే ఇంటర్వ్యూ వందేళ్ల క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు

రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే కూడా ఆయన తన చిత్రాల కోసం చేసే ప్రమోషన్లే అంతో ఇంతో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలా అని అవి ఆయన సినిమాలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా అంటే అదేమీ లేదు.

మొన్ననే వర్మ నుంచి ‘డేంజరస్’ అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజైన సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఏదో నామమాత్రంగా రిలీజ్ చేశారు. సినిమా గాల్లో కలిసిపోయింది. కానీ ఈ సినిమా కోసం వర్మ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇటీవలే ఆషు రెడ్డితో కలిసి వర్మ ఒక వల్గర్ ఇంటర్వ్యూ చేశాడు. వల్గర్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అందులో పోర్న్ స్టార్ తరహాలో ఆషు రెడ్డి కాళ్లను ఆయన నాకిన తీరు చూసి జనాలకు వెగటు పుట్టింది. దీని మీద వివరణ ఇస్తూ ఇంకో వీడియో రిలీజ్ చేస్తూ ఏవో లాజిక్కులు చెప్పాడు వర్మ. కానీ జనాలకు అదేమీ పట్టలేదు.

ఈలోపు వర్మ ఇంకో వీడియో ఇంటర్వ్యూతో వచ్చాడు. ఎవరో స్టేజీ అట. ఆమెను వర్మ ఇంటర్వ్యూ చేశాడు. పది రోజులు స్నానం చేయనన్న స్టేజీతో నా ఇంటర్వ్యూ అంటూ వర్మ ఇంటర్వ్యూ లింక్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఐతే ఈ ఇంటర్వ్యూలో ఉండేదేంటో జనాలకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు.

కానీ సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ ఇంటర్వ్యూ మీద ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘‘ఇదే ఇంటర్వ్యూ వందేళ్ల క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. యాభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరితెగించడం వల్ల మీరు బతికిపోయారు’’ అంటూ వర్మను ట్యాగ్ చేశాడు రవి.

ఈ కామెంట్‌ను బట్టే వీడియో ఎంత సెన్సేషనల్‌గా ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. ఐతే రవి యథాలాపంగా ఆ కామెంట్ చేశాడా.. వర్మను విమర్శించాడా అన్నది జనాలకు అర్థం కావడం లేదు. ఒకవేళ విమర్శించినా వర్మ అయితే దాన్ని పట్టించుకునే రకం కాదు.

This post was last modified on December 15, 2022 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

6 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 hours ago