ఒక పెద్ద హిట్ పడగానే హీరో హీరోయిన్లు పారితోషకాలను పెంచేయడం ఇండస్ట్రీలో మామూలే. సినిమాల బిజినెస్ జరిగేది ప్రధానంగా వీరి పేరు మీదే కాబట్టి పారితోషకం పెంచడాన్ని తప్పుబట్టలేం కూడా.
ఐతే ఆ పెంపు మరీ ఎక్కువ ఉంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అది కరెక్టేనా అనిపిస్తుంది. ఇప్పుడు యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ విషయంలో ఇదే చర్చ నడుస్తోంది. నిఖిల్ తన కొత్త చిత్రానికి ఏకంగా రూ.8 కోట్ల పారితోషకం పుచ్చుకోబోతున్నాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
నిఖిల్ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి చివరి సినిమా ‘కార్తికేయ-2’ అసాధారణ విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా సాధించిన వసూళ్లు షాకింగ్ అనే చెప్పాలి. నిఖిల్ స్థాయికి వంద కోట్ల వసూళ్లు అన్నవి ఊహకు అందని విషయం. ‘కార్తికేయ-2’ ఆ అసాధారణ ఘనతను అందుకుంది.
దీని తర్వాత నిఖిల్ నుంచి రాబోతున్న ‘18 పేజెస్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే అది ఒక సగటు లవ్ స్టోరీ కావడంతో పాన్ ఇండియా రిలీజ్ వద్దనుకుంటున్నాడు నిఖిల్.
అక్కడ తనపై పెరిగిన అంచనాలకు తగ్గ సినిమాలే అందించాలనుకుంటున్నాడు. ఇందుకోసమే ‘కార్తికేయ-3’ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం దర్శకుడు చందూ మొండేటి ఆ స్క్రిప్టు మీదే పని చేస్తున్నాడు.
ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే పారితోషకం రూ.8 కోట్లు పుచ్చుకోబోతున్నాడట నిఖిల్. ఈ సినిమాకు జరిగే బిజినెస్ను బట్టి చూస్తే అది మరీ పెద్ద నంబరేమీ కాదు.
కానీ నిఖిల్ చేసే వేరే చిత్రాలకు కూడా ఇదే స్థాయిలోపారితోషకం అందుకోవాలంటే కెరీర్లో అతను మరో మెట్టు ఎదగాలి. ఇంకో రెండు హిట్లు పడాలి. అదే జరిగితే నిఖిల్.. నాని లీగ్లోకి వెళ్లిపోతాడు. 18 పేజెస్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…