సంక్రాంతి సినిమాల సందడికి ఇంకో నెల రోజులు కూడా సమయం లేదు. ఇంకో నాలుగు వారాలు తిరిగేసరికి బొమ్మ పడిపోతుంది. సంక్రాంతికి షెడ్యూల్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చివరి దశ షూటింగ్లో ఉన్నాయి. టాకీ పార్ట్ రెంటికీ దాదాపు పూర్తయినట్లే. రెండు చిత్రాలూ ఇప్పుడు మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ మీద దృష్టిపెట్టాయి.
ఐతే ‘వీరసింహారెడ్డి’ టీమే కొంచెం ముందుగా గుమ్మడి కాయ కొట్టేట్లు కనిపిస్తోది. పండక్కి ముందుగా రాబోయే సినిమా అదేనన్న సంగతి తెలిసిందే. దీంతో ఫస్ట్ కాపీ కూడా త్వరగా తీయాలని, చివర్లో హడావుడి ఉండకూడదని చిత్ర బృందం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీని రెడీ చేసేసినట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్కు సంబంధించి ఎడిటింగ్ అంతా కూడా పూర్తి చేసేశారట. ఫారిన్లో తీస్తున్న పాటలకు సంబంధించి ఔట్ పుట్ రాగానే ఎడిటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీకి కలపడం మాత్రమే మిగిలి ఉంది.
ఆ పాటల రన్ టైం తెలిసిందే కాబట్టి.. టాకీ పార్ట్ను కలిపితే ఫైనల్ రన్ టైం ఎంత అన్నది కూడా తేలిపోయినట్లు సమాచారం. సినిమా నిడివి కొంచెం ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ‘వీరసింహారెడ్డి’ రన్ టైం 2 గంటల 43 నిమిషాలట. అంటే సినిమా కొంచెం పెద్దదనే చెప్పాలి. ప్రస్తుతం చాలా వరకు సినిమా రెండున్నర గంటలు అంతకంటే తక్కువ నిడివితోనే రిలీజవుతున్నాయి. కానీ బాలయ్య సినిమాలు ఎప్పుడూ కొంచెం పెద్ద నిడివితోనే ఉంటాయి. ఆయన చివరి సినిమా ‘అఖండ’ సైతం 2.45 గంటల నిడివితో రిలీజైంది. ఆ ట్రెండును కొనసాగిస్తూ ‘వీరసింహారెడ్డి’కి కూడా ఎక్కువ రన్ టైం పెట్టినట్లున్నారు.
బాలయ్య సరసన శ్రుతి హాసన్, హనీ రాజ్ నటించిన ‘వీరసింహారెడ్డి’లో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on December 14, 2022 2:24 pm
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…