ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో ప్యాన్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ కు అది పదిహేనవ సినిమా అన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబుతో ప్రకటించిన దానికి నెంబర్ ఇవ్వకుండా మెగా కాంపౌండ్ జాగ్రత్త పడింది. అంటే దీనికన్నా ముందు మరొకటి ఉంటుందన్న క్లారిటీ వచ్చెసింధి. అయితే ఎవరితో అనే కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదటిది సుకుమార్. పుష్ప 2 ది రూల్ తర్వాత రంగస్థలం కాంబో రిపీట్ కావడం కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి రెండు మూడు సందర్భాల్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు. ఇంట్రో ఎపిసోడ్ చెప్పినప్పుడు తను షాక్ అయ్యానని ఎప్పుడెప్పుడు మొదలువుతుందాని ఎదురు చూస్తున్నట్టుగా తాజాగా ఫిలిం కంపానియన్ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు.
సో ఫలానా టైం అని చెప్పలేం కానీ మొత్తానికి సుక్కు చరణ్ లు చేతులు కలపబోతున్నారు. మరో పేరు నర్తన్. కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఇతను చాలా కాలంగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మీద వర్క్ చేస్తున్నాడు. యష్ దాదాపు ఓకే చెప్పినంత పని చేసి మళ్ళీ పెండింగ్ లో పెట్టాడు. ఈలోగా అదే కథను చరణ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఆ స్థానంలో దీన్ని రీ ప్లేస్ చేసేందుకు యువి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదింకా అఫీషియల్ కాలేదు కాబట్టి దీనికీ సంఖ్య చెప్పడం కష్టం. ఫైనలయ్యే అవకాశాలు ఎక్కువే
ఆర్ఆర్ఆర్ తర్వాత తమ మీద ఇంటర్నేషనల్ ఫోకస్ పడటంతో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం నేరుగా ఫేమ్ మీద పడుతుంది. అందుకే కొరటాల శివది ఎంత లేట్ అవుతున్నా తారక్ ఓపిక పడుతున్నాడు తప్పించి హడావిడిగా షూటింగ్ మొదలుపెట్టమని ఒత్తిడి చేయడం లేదు. చరణ్ మాత్రం పక్కా స్కెచ్ తో కాంబోస్ ని సెట్ చేసుకుంటూ రాబోయే రెండుమూడేళ్ల వరకు డైరెక్టర్ల సమస్య రాకుండా చూసుకుంటున్నారు. తర్వాత వరసలో కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా వరసలో ఉన్నారు మరి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…