ఆ మధ్య అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రిలీజైనప్పుడు బాయ్ కాట్ నినాదం సోషల్ మీడియాలో ఎంత తీవ్రంగా పని చేసిందో ప్రత్యక్షంగా చూశాం. సినిమా బాగుంటే తగ్గేది కానీ అది మరీ డిజాస్టర్ స్థాయిలో ఉండటంతో ఓపెనింగ్స్ కూడా బలంగా రాలేకపోయాయి. బ్రహ్మాస్త్రని సైతం ఈ నిషేధ నినాదాల బ్యాచ్ టార్గెట్ చేసినా కంటెంట్ పర్లేదనిపించేలా ఉండటంతో బాలీవుడ్ వరకు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా వచ్చే నెల విడుదల కాబోతున్న షారుఖ్ ఖాన్ పఠాన్ మీద కూడా మెల్లగా ఈ నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవలే రిలీజైన బేషరం వీడియో సాంగ్ తాలూకు ప్రకంపనలు మొదలైపోయాయి.
ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకునే రెచ్చిపోయి అందాల ఆరబోత చేసింది. ఇదేమి కొత్తా కాదు వింతా కాదు. అయితే కుంకుమ పువ్వు రంగు స్విమ్ సూట్లు బికినీలు వేసుకుని గ్లామర్ షో చేయడం పట్ల పలు హిందూ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ స్లోగన్ ని స్టార్ట్ చేశాయి. ఇరవై నాలుగు గంటలు దాటకుండానే వేలాది ట్వీట్ లో టాప్ ట్రెండింగ్ లో పెట్టేస్తున్నారు. ఎవరూ ఈ సినిమా చూడకూడదని దీపికాకు గుణపాఠం చెప్పాలంటే ఇదే సరైన మార్గమని ఒకటే హల్చల్ చేస్తున్నారు. దీని గురించి షారుఖ్ తో సహా పఠాన్ బృందంలో ఎవరూ స్పందించలేదు కానీ టాపిక్ అయితే హాట్ గా ఉంది.
ఆ మధ్య దీపికా పదుకునే భర్త రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసి వివాదం రేపిన సంగతి గుర్తే. కేసులు నమోధై వ్యవహారం కోర్టు దాకా వెళ్ళినప్పుడు తూచ్ అది నేను కాదు మార్ఫింగ్ చేశారని కప్పిపుచ్చుకున్నాడు కానీ అసలు నిజాలు ఇంకా బయటికి రానే లేదు. ఇప్పుడిలా భార్య వల్ల పఠాన్ కో ట్విస్టు వచ్చి పడింది. ఇదంతా తమ మంచికే అని బాద్షా టీమ్ లోలోపల సంతోషంగా ఫీలైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంట్రావర్సీ వల్ల వచ్చే ఫ్రీ పబ్లిసిటీ ఎన్ని కోట్లు పోసినా కొనలేం. అందులోనూ మనోభావాలు దెబ్బ తిన్న బ్యాచ్ తోడైతే రీచ్ పెద్ద స్థాయిలో వెళ్ళిపోతుంది. ఇప్పడు జరుగుతోంది అదే మరి.
This post was last modified on December 14, 2022 12:38 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…