గత ఏడాది విక్రమ్ తో అంతకు ముందు ఖైదీతో తమిళ ఆడియన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మన స్టార్ హీరోలతో ఎప్పుడు చేస్తాడా అనే ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. దగ్గరలో కాదు కదా కనీసం ఓ పది సంవత్సరాల వరకు తన డైరీ ఖాళీ లేదని కుండబద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం విజయ్ తో చేయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న లోకేష్ ఈసారి కూడా భారీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోబోతున్నాడు. లోకి యునివర్స్ పేరుతో డెవెలప్ చేస్తున్న కాన్సెప్ట్ కి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథను అది కూడా మాస్టర్ ని మించేలా రాసుకుంటున్నాడట.
ఇది పూర్తయ్యాక ఖైదీ 2 మొదలవుతుంది. కార్తీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైలుకు వెళ్ళడానికి ముందు ఢిల్లీ జీవితంలో ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. ఆ తర్వాత విక్రమ్ 2 స్టార్ట్ చేస్తారు. కమల్ హాసన్ ఆలోగా ఇండియన్ 2తో పాటు మరో రెండు పూర్తి చేసి ఫ్రీ అవుతారు. ఆ తర్వాత సూర్యతో భారీ స్కేల్ తో రొలెక్స్ ప్లాన్ ఉంటుంది. ఎంతలేదన్నా ఒక్కోదానికి రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. అది దృష్టిలో ఉంచుకునే టెన్ ఇయర్స్ ఐ యాం లాక్డ్ అని లోకేష్ స్పష్టంగా చెప్పేశాడు. రామ్ చరణ్ తో చేసే అవకాశాలు దాదాపు కనుమరుగైనట్టే. ఒకవేళ ప్లాన్ చేసుకున్నా ఇప్పట్లో జరగదు.
కోలీవుడ్ తన మొదటి ప్రాధాన్యం అంటూ చెబుతూ వస్తున్న లోకేష్ కనగరాజ్ దానికే కట్టుబడుతున్నాడు. బాలీవుడ్ నుంచి సైతం క్రేజీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించి తనదైన మాఫియా ప్రపంచాన్ని సరికొత్తగా చూపించబోతున్నాడు. వీటిలో ఎక్కువ హైప్ వచ్చేది మాత్రం సూర్య నటించబోయే రోలెక్స్ కే. కేవలం అయిదు నిమిషాల క్యామియోకే విక్రమ్ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఫుల్ లెన్త్ రోల్ అది కూడా తమ్ముడు కార్తీ కాంబినేషన్ లో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. అన్నింటికి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూర్చబోతున్నాడు. సో లోకేష్ ని ఇప్పుడప్పుడే ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే.
This post was last modified on December 13, 2022 12:23 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…