గత ఏడాది విక్రమ్ తో అంతకు ముందు ఖైదీతో తమిళ ఆడియన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మన స్టార్ హీరోలతో ఎప్పుడు చేస్తాడా అనే ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది. దగ్గరలో కాదు కదా కనీసం ఓ పది సంవత్సరాల వరకు తన డైరీ ఖాళీ లేదని కుండబద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం విజయ్ తో చేయబోయే సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న లోకేష్ ఈసారి కూడా భారీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోబోతున్నాడు. లోకి యునివర్స్ పేరుతో డెవెలప్ చేస్తున్న కాన్సెప్ట్ కి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథను అది కూడా మాస్టర్ ని మించేలా రాసుకుంటున్నాడట.
ఇది పూర్తయ్యాక ఖైదీ 2 మొదలవుతుంది. కార్తీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైలుకు వెళ్ళడానికి ముందు ఢిల్లీ జీవితంలో ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. ఆ తర్వాత విక్రమ్ 2 స్టార్ట్ చేస్తారు. కమల్ హాసన్ ఆలోగా ఇండియన్ 2తో పాటు మరో రెండు పూర్తి చేసి ఫ్రీ అవుతారు. ఆ తర్వాత సూర్యతో భారీ స్కేల్ తో రొలెక్స్ ప్లాన్ ఉంటుంది. ఎంతలేదన్నా ఒక్కోదానికి రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. అది దృష్టిలో ఉంచుకునే టెన్ ఇయర్స్ ఐ యాం లాక్డ్ అని లోకేష్ స్పష్టంగా చెప్పేశాడు. రామ్ చరణ్ తో చేసే అవకాశాలు దాదాపు కనుమరుగైనట్టే. ఒకవేళ ప్లాన్ చేసుకున్నా ఇప్పట్లో జరగదు.
కోలీవుడ్ తన మొదటి ప్రాధాన్యం అంటూ చెబుతూ వస్తున్న లోకేష్ కనగరాజ్ దానికే కట్టుబడుతున్నాడు. బాలీవుడ్ నుంచి సైతం క్రేజీ ఆఫర్లు వచ్చినా తిరస్కరించి తనదైన మాఫియా ప్రపంచాన్ని సరికొత్తగా చూపించబోతున్నాడు. వీటిలో ఎక్కువ హైప్ వచ్చేది మాత్రం సూర్య నటించబోయే రోలెక్స్ కే. కేవలం అయిదు నిమిషాల క్యామియోకే విక్రమ్ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఫుల్ లెన్త్ రోల్ అది కూడా తమ్ముడు కార్తీ కాంబినేషన్ లో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. అన్నింటికి అనిరుద్ రవిచందరే సంగీతం సమకూర్చబోతున్నాడు. సో లోకేష్ ని ఇప్పుడప్పుడే ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే.
This post was last modified on December 13, 2022 12:23 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…