తెలుగు అమ్మాయి అయిన అంజలి.. తమిళంలో ఒక టైంలో మంచి రేంజికే వెళ్లింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకుని మిడ్ రేంజ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. రచ్చ గెలిచాక ఇంటికి వచ్చి ఇక్కడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ లాంటి చిత్రాలతో సత్తా చాటింది.
ఐతే తనతో కలిసి ‘జర్నీ’తో పాటు ‘బెలూన్’ సినిమాలో జంటగా నటించిన జైతో కలిసి ఆమె ఒక టైంలో సహజీవనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు తమ బంధాన్ని వాళ్లు దాచుకోవాలని కూడా ప్రయత్నించలేదు. జ్యోతిక నటించిన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా భార్య పక్కనుండగా దోసె వేయమంటూ సూర్య ఒక ఛాలెంజ్ ఏదో విసిరితే.. అంజలి పక్కనుండగా జై ఈ ఛాలెంజ్ను ట్రై చేయడం గమనార్హం. అప్పుడే వారి మధ్య బంధం బహిర్గతం అయింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. వీళ్లిద్దరూ విడిపోయారు. పెళ్లి వైపు అడుగులు వేయలేదు.
కొన్నేళ్ల నుంచి అంజలి సింగిల్గానే ఉంటోంది. కానీ ఇటీవల ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి గురించి స్పందిస్తూ.. ఒకప్పటి తన రిలేషన్షిప్ గురించి కూడా కామెంట్ చేసింది అంజలి.
“కొన్నేళ్ల ముందు నేను ఒక విషపూరితమైన బంధం (టాక్సిక్ రిలేషన్షిప్)లో ఉన్నా. ఐతే ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఆ రిలేషన్షిప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ అది నేను ఊహించుకున్నంత అందంగా లేదు. ఇండస్ట్రీలోని వ్యక్తితో నేను రిలేషన్లో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. ఇండస్ట్రీలో నాకెంతోమంది సన్నిహితులున్నారు. నేను ఎవరితో సన్నిహితంగా ఉంటానన్నది నా వ్యక్తిగత విషయం. ఇక నాకు అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయిపోయిందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. నన్ను అన్ని విధాలా గౌరవించే వ్యక్తి దొరికినపుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అని అంజలి పేర్కొంది.
This post was last modified on December 13, 2022 11:24 am
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…