నిఖిల్ సిద్దార్థ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 భారీ వసూళ్లు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కథ రెడీ అవుతుంది. కార్తికేయ సినిమా వచ్చిన చాలా ఏళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో సరికొత్త కథ రాసుకున్నాడు చందూ మొండేటి. కార్తికేయ 2 ఎవరూ ఊహించని విధంగా అవలీలగా వంద కోట్ల మార్క్ కి చేరుకుంది. నార్త్ లో మంచి వసూళ్ళు రాబట్టి టాలీవుడ్ కి షాకిచ్చింది. ‘కార్తికేయ 2’ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎక్కువ ఆలస్యం చేయకుండా దానికి సీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పటికే ఒక పాయింట్ అనేసుకొని కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇటివల నిఖిల్ తో ఆ పాయింట్ డిస్కస్ చేసి లాక్ చేసుకున్నాడట దర్శకుడు. కార్తికేయ 2 ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ , విశ్వప్రసాద్ నే కార్తికేయ 3 నిర్మించనున్నారని తెలుస్తుంది. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి గీతా ఆర్ట్స్ కి ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలకు సంబందించి నెరేషన్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి కార్తికేయ 3 ని రెడీ చేసే పనిలో ఉన్నాడట చందూ.
కార్తికేయ 2 అంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అందులో ఉన్న కృష్ణతత్వం, అలాగే ట్రెజర్ హంట్ సీక్వెన్స్ . ఈ రెండు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి కార్తికేయ 3 లో అలాంటి డెవోషనల్ పాయింట్ తో పాటు ఎగ్జైటింగ్ గా చూడగలిగే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే మరోసారి నిఖిల్ చందూ కాంబో మరోసారి మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. కార్తీకేయ 2 క్రేజ్ ఎలాగో ఉంది కాబట్టి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరగొచ్చు. ప్రస్తుతం నిఖిల్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే చాన్స్ కనిపిస్తుంది.
This post was last modified on December 12, 2022 9:53 pm
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…