నిఖిల్ సిద్దార్థ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 భారీ వసూళ్లు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ కథ రెడీ అవుతుంది. కార్తికేయ సినిమా వచ్చిన చాలా ఏళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో సరికొత్త కథ రాసుకున్నాడు చందూ మొండేటి. కార్తికేయ 2 ఎవరూ ఊహించని విధంగా అవలీలగా వంద కోట్ల మార్క్ కి చేరుకుంది. నార్త్ లో మంచి వసూళ్ళు రాబట్టి టాలీవుడ్ కి షాకిచ్చింది. ‘కార్తికేయ 2’ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎక్కువ ఆలస్యం చేయకుండా దానికి సీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట దర్శకుడు చందూ మొండేటి. ఇప్పటికే ఒక పాయింట్ అనేసుకొని కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇటివల నిఖిల్ తో ఆ పాయింట్ డిస్కస్ చేసి లాక్ చేసుకున్నాడట దర్శకుడు. కార్తికేయ 2 ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ , విశ్వప్రసాద్ నే కార్తికేయ 3 నిర్మించనున్నారని తెలుస్తుంది. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి గీతా ఆర్ట్స్ కి ఓ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని కథలకు సంబందించి నెరేషన్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి కార్తికేయ 3 ని రెడీ చేసే పనిలో ఉన్నాడట చందూ.
కార్తికేయ 2 అంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ అందులో ఉన్న కృష్ణతత్వం, అలాగే ట్రెజర్ హంట్ సీక్వెన్స్ . ఈ రెండు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరి కార్తికేయ 3 లో అలాంటి డెవోషనల్ పాయింట్ తో పాటు ఎగ్జైటింగ్ గా చూడగలిగే స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే మరోసారి నిఖిల్ చందూ కాంబో మరోసారి మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. కార్తీకేయ 2 క్రేజ్ ఎలాగో ఉంది కాబట్టి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరగొచ్చు. ప్రస్తుతం నిఖిల్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే చాన్స్ కనిపిస్తుంది.
This post was last modified on December 12, 2022 9:53 pm
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…