గత ఏడాది ఇదే నెలలో ‘పుష్ప’ అనే సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ఇతర భాషల్లో అంతగా హైప్ లేదు. కానీ హిందీ, తమిళ భాషల్లో తెలుగును మించి ఈ సినిమా విజయం సాధించింది. ఉత్తరాది జనాలను అయితే ‘పుష్ప’ మామూలుగా ఊపేయలేదు. అక్కడి నుంచి ఆ సినిమా క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లిపోయింది. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకునే దిశగా సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతోంది.
ముందు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుని స్క్రిప్టు తీర్చిదిద్దుకుని ఇటీవలే ‘పుష్ప-2’ చిత్రీకరణ మొదలుపెట్టారు. ముందుగా ఒక కాన్సెప్ట్తో టీజర్ విజువల్స్ తీసుకుని.. ఆ తర్వాత రెగ్యులర్ షూట్కు వెళ్లారు. ఇంకో ఐదు రోజుల్లో ‘పుష్ప’ వార్షికోత్సవం జరగబోతోంది. ఆ రోజే ‘పుష్ప-2’ ఫస్ట్ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒక సెన్సేషనల్ ఫస్ట్ లుక్తో పాటు ‘పుష్ప-2’ కాన్సెప్ట్ టీజర్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప-2’లో బన్నీ పులితో ఫైట్ చేయబోతున్నాడని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం బన్నీ శిక్షణ కూడా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ‘పుష్ప-2’ టీజర్ పులి చుట్టూనే తిరుగుతుందట కానీ.. పులితో ఫైట్ లాంటిదేమీ ఉండదన్నది విశ్వసనీయ సమాచారం.
పుష్ప అడవిలో అడుగు పెడితే పులి అతణ్ని చూసి వెనుకడుగు వేయడం.. ఈ క్రమంలో ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం’’ అనే డైలాగ్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తుందట. ఈ డైలాగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయి చక్కర్లు కొడుతోంది. టీజర్ కథ ఇలా ఉంటే.. దీంతో పాటుగా రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్లో బన్నీ ఒక స్టన్నింగ్ అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ఆ అవతారం ఎవరి ఊహకూ అందని విధంగా ఉంటుందట.
This post was last modified on December 12, 2022 9:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…