గత ఏడాది ఇదే నెలలో ‘పుష్ప’ అనే సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ఇతర భాషల్లో అంతగా హైప్ లేదు. కానీ హిందీ, తమిళ భాషల్లో తెలుగును మించి ఈ సినిమా విజయం సాధించింది. ఉత్తరాది జనాలను అయితే ‘పుష్ప’ మామూలుగా ఊపేయలేదు. అక్కడి నుంచి ఆ సినిమా క్రేజ్ ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లిపోయింది. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకునే దిశగా సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతోంది.
ముందు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుని స్క్రిప్టు తీర్చిదిద్దుకుని ఇటీవలే ‘పుష్ప-2’ చిత్రీకరణ మొదలుపెట్టారు. ముందుగా ఒక కాన్సెప్ట్తో టీజర్ విజువల్స్ తీసుకుని.. ఆ తర్వాత రెగ్యులర్ షూట్కు వెళ్లారు. ఇంకో ఐదు రోజుల్లో ‘పుష్ప’ వార్షికోత్సవం జరగబోతోంది. ఆ రోజే ‘పుష్ప-2’ ఫస్ట్ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒక సెన్సేషనల్ ఫస్ట్ లుక్తో పాటు ‘పుష్ప-2’ కాన్సెప్ట్ టీజర్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘పుష్ప-2’లో బన్నీ పులితో ఫైట్ చేయబోతున్నాడని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం బన్నీ శిక్షణ కూడా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ‘పుష్ప-2’ టీజర్ పులి చుట్టూనే తిరుగుతుందట కానీ.. పులితో ఫైట్ లాంటిదేమీ ఉండదన్నది విశ్వసనీయ సమాచారం.
పుష్ప అడవిలో అడుగు పెడితే పులి అతణ్ని చూసి వెనుకడుగు వేయడం.. ఈ క్రమంలో ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం’’ అనే డైలాగ్ బ్యాగ్రౌండ్లో వినిపిస్తుందట. ఈ డైలాగ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయి చక్కర్లు కొడుతోంది. టీజర్ కథ ఇలా ఉంటే.. దీంతో పాటుగా రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్లో బన్నీ ఒక స్టన్నింగ్ అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ఆ అవతారం ఎవరి ఊహకూ అందని విధంగా ఉంటుందట.
This post was last modified on December 12, 2022 9:39 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…