మొన్న శుక్రవారం మహా సందడిగా పదికి పైగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కనీస ప్రభావం చూపించే స్థాయిలో లేకపోవడంతో ట్రేడ్ కి మరో బ్లాక్ ఫ్రైడే తప్పలేదు.
కనీసం థియేటర్ నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టలేనంత వీక్ గా రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో అసలే చలి వర్షంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. పబ్లిసిటీ పరంగా ముఖచిత్రంకు హడావిడి బాగానే చేశారు కానీ రాంగ్ క్యాస్టింగ్, ఫస్ట్ హాఫ్ ల్యాగ్, డ్రామాని డామినేట్ చేసిన మెసేజ్ ఇవన్నీ దెబ్బేశాయి. లాయర్ గా విశ్వక్ సేన్ క్యామియో సైతం ఆకట్టుకోలేదు
ఇక గుర్తుందా శీతాకాలంని రిలీజ్ రోజు మ్యాట్నీకే ఆడియెన్స్ మర్చిపోయారు. ఇంత నీరసమైన ప్రేమకథలో సత్యదేవ్ లాంటి పవర్ ఫుల్ నటుడిని చూపించే ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. రీమేక్ హక్కులు కొనే ముందు మన జనాల టేస్ట్ కు సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోకపోతే జరిగే పరిణామాలను మరోసారి చూపించింది.
పంచతంత్రంను చూసిన కొద్దిగొప్పో క్లాస్ జనాలు పర్వాలేదనే సర్టిఫికెట్ ఇచ్చినా ఇలాంటివి వెబ్ సిరీస్ లో అలవాటయ్యాక ఖర్చు పెట్టుకుని మరీ టికెట్లు కొని చూసే మూడ్ లో పబ్లిక్ లేరు. ఇక లెహరాయి, చెప్పాలని ఉంది, వర్మ మా ఇష్టం, @లవ్, విజయానంద్ ఇవన్నీ షోలు క్యాన్సిలైనవే ఎక్కువ.
దెబ్బకు హిట్ 2 ది సెకండ్ కేస్ అంతోఇంతో మెరుగైన వసూళ్లు రాబట్టడం విశేషం. మరీ తీవ్రంగా కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం పికప్ కావడం మంచిదే. మసూద సైతం అలాగే నెట్టుకొస్తోంది.
అవతార్ 2కు భయపడి ఒకేసారి ఇన్నేసి సినిమాలు డిసెంబర్ 9న కలబడటం వల్ల నిర్మాతలకు బయ్యర్లకు ఇద్దరికీ కలిగిన ప్రయోజనం శూన్యం. థియేటర్ రిలీజ్ జరిగిపోయింది కాబట్టి ఓటిటికి రూట్ క్లియర్ అవ్వడం తప్ప ఒరిగిందేమి లేదు. ఎలాగూ జనాలు అవతార్ 2కి రెడీ అవుతున్నారు కాబట్టి ఈ నాలుగు రోజులు సినిమా హాళ్లకు దినదిన గండమే. మరీ ముఖ్యంగా బిసి సెంటర్లలో మరీ తీవ్రంగా ఉండనుంది.
This post was last modified on December 12, 2022 12:48 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…