మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ ట్రైలర్ విడుదల కాలేదు కానీ ‘బాస్ పార్టీ’ అనే పాట మాత్రం రిలీజ్ చేశారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చిత్రీకరించిన ఈ పాట అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అనే లిరిక్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు పాత రోజులను తలపించాయి. ఇక ఈ స్టెప్పులు అతని అభిమానులంతా రిపీట్ చేసి ఇన్స్టా గ్రామ్ లో పెట్టేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చిరంజీవి మనవరాలు కూడా ఈ సినిమా పాట స్టెప్పులను వేయగా ఆమె తల్లి, మెగాస్టార్ కూతురు అయిన సుస్మిత కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సుస్మిత కొణిదెల ప్రస్తుతం చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. యూరప్ లో ఒక పాట చిత్రీకరణ కోసం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్లారు.
ఇక ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులు సమకూర్చిన శేఖర్ మాస్టర్ తో ఈ పాటకి సుస్మిత కొణిదెల పెద్ద కూతురు కూడా మంచులో “బాసు వేర్ ఇస్ ద పార్టీ” అంటూ స్టెప్పులు వేయగా సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
This post was last modified on December 11, 2022 9:10 pm
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…