మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ ట్రైలర్ విడుదల కాలేదు కానీ ‘బాస్ పార్టీ’ అనే పాట మాత్రం రిలీజ్ చేశారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చిత్రీకరించిన ఈ పాట అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అనే లిరిక్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు పాత రోజులను తలపించాయి. ఇక ఈ స్టెప్పులు అతని అభిమానులంతా రిపీట్ చేసి ఇన్స్టా గ్రామ్ లో పెట్టేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చిరంజీవి మనవరాలు కూడా ఈ సినిమా పాట స్టెప్పులను వేయగా ఆమె తల్లి, మెగాస్టార్ కూతురు అయిన సుస్మిత కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సుస్మిత కొణిదెల ప్రస్తుతం చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. యూరప్ లో ఒక పాట చిత్రీకరణ కోసం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్లారు.
ఇక ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులు సమకూర్చిన శేఖర్ మాస్టర్ తో ఈ పాటకి సుస్మిత కొణిదెల పెద్ద కూతురు కూడా మంచులో “బాసు వేర్ ఇస్ ద పార్టీ” అంటూ స్టెప్పులు వేయగా సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
This post was last modified on December 11, 2022 9:10 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…