మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు టీజర్ ట్రైలర్ విడుదల కాలేదు కానీ ‘బాస్ పార్టీ’ అనే పాట మాత్రం రిలీజ్ చేశారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చిత్రీకరించిన ఈ పాట అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ‘వేర్ ఈజ్ ద పార్టీ’ అనే లిరిక్ వద్ద మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులు పాత రోజులను తలపించాయి. ఇక ఈ స్టెప్పులు అతని అభిమానులంతా రిపీట్ చేసి ఇన్స్టా గ్రామ్ లో పెట్టేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చిరంజీవి మనవరాలు కూడా ఈ సినిమా పాట స్టెప్పులను వేయగా ఆమె తల్లి, మెగాస్టార్ కూతురు అయిన సుస్మిత కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సుస్మిత కొణిదెల ప్రస్తుతం చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. యూరప్ లో ఒక పాట చిత్రీకరణ కోసం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్లారు.
ఇక ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులు సమకూర్చిన శేఖర్ మాస్టర్ తో ఈ పాటకి సుస్మిత కొణిదెల పెద్ద కూతురు కూడా మంచులో “బాసు వేర్ ఇస్ ద పార్టీ” అంటూ స్టెప్పులు వేయగా సుస్మిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
This post was last modified on December 11, 2022 9:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…