టాలీవుడ్లో మంచు మనోజ్ అనే హీరో ఒకరున్నారనే విషయాన్ని జనాలు నెమ్మదిగా మరిచిపోతున్నారు. ఆరంభంలో కొంచెం తడబడ్డా.. ఆ తర్వాత నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ లాంటి చిత్రాలతో అతను బాగానే ఆకట్టుకున్నాడు. వీటిలో బిందాస్, పోటుగాడు, కరెంటు తీగ చిత్రాలు కమర్షియల్గా కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
మంచు ఫ్యామిలీ రెండో తరంలో అత్యంత ప్రామిసింగ్గా కనిపించింది మనోజే. ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడని అతడి మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది. కానీ వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి హీరోనైనా షేక్ చేస్తాయనడానికి మనోజ్ ఉదాహరణగా నిలిచాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను హీరోగా సినిమాలే చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో పాన్ ఇండియా సినిమాను మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి ఏడాదిగా ఏ న్యూస్ బయటికి రాలేదు. సైలెంటుగా షూటింగ్ చేస్తున్నాడేమో అని కొన్నాళ్లు అనుకున్నారు కానీ.. చివరికి చూస్తే ఆ సినిమాను మనోజ్ పక్కన పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ట్విట్టర్లో మంచు మనోజ్ స్పందనే ఇందుకు నిదర్శనం.
మనోజ్ తాజాగా ఒక ఫొటో షేర్ చేసి దానికేదో క్యాప్షన్ పెడితే.. ఇంతకీ నీ ‘బ్రహ్మాస్త్రం’ ఏమైందన్నా అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి ఒక స్మైలీ ఎమోజీ జోడించి ఊరుకున్నాడు మనోజ్. మరో ట్విట్టర్ పాలోయర్ సైతం ఇదే విషయం ప్రస్తావిస్తూ ‘అహం బ్రహ్మాస్మి’ పోస్టర్ పెట్టి, దీని గురించి అడిగితే ఆన్సర్ లేదు అంటూ మనోజ్ను ట్యాగ్ చేశాడు.
దీనికి కూడా అదే స్మైలీ ఎమోజీ పెట్టాడే తప్ప మనోజ్ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. మనోజ్ రెస్పాన్స్ను బట్టి చూస్తే ఈ సినిమాను ఆపేశారని అర్థమవుతుంది. మేకింగ్ దశలో ఉండుంటే మనోజ్ ఇలా సమాధానం దాటవేసేవాడు కాదు, నవ్వే వాడు కాదు. మరి అది కాకపోయినా వేరేదైనా సినిమా అయినా చేస్తాడా లేక సినిమాలే మానుకుంటాడా మనోజ్?
This post was last modified on December 9, 2022 6:07 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…