టాలీవుడ్లో మంచు మనోజ్ అనే హీరో ఒకరున్నారనే విషయాన్ని జనాలు నెమ్మదిగా మరిచిపోతున్నారు. ఆరంభంలో కొంచెం తడబడ్డా.. ఆ తర్వాత నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ లాంటి చిత్రాలతో అతను బాగానే ఆకట్టుకున్నాడు. వీటిలో బిందాస్, పోటుగాడు, కరెంటు తీగ చిత్రాలు కమర్షియల్గా కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
మంచు ఫ్యామిలీ రెండో తరంలో అత్యంత ప్రామిసింగ్గా కనిపించింది మనోజే. ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేస్తాడని అతడి మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది. కానీ వరుస ఫెయిల్యూర్లు ఎలాంటి హీరోనైనా షేక్ చేస్తాయనడానికి మనోజ్ ఉదాహరణగా నిలిచాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అతను హీరోగా సినిమాలే చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో పాన్ ఇండియా సినిమాను మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి ఏడాదిగా ఏ న్యూస్ బయటికి రాలేదు. సైలెంటుగా షూటింగ్ చేస్తున్నాడేమో అని కొన్నాళ్లు అనుకున్నారు కానీ.. చివరికి చూస్తే ఆ సినిమాను మనోజ్ పక్కన పెట్టేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ట్విట్టర్లో మంచు మనోజ్ స్పందనే ఇందుకు నిదర్శనం.
మనోజ్ తాజాగా ఒక ఫొటో షేర్ చేసి దానికేదో క్యాప్షన్ పెడితే.. ఇంతకీ నీ ‘బ్రహ్మాస్త్రం’ ఏమైందన్నా అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి ఒక స్మైలీ ఎమోజీ జోడించి ఊరుకున్నాడు మనోజ్. మరో ట్విట్టర్ పాలోయర్ సైతం ఇదే విషయం ప్రస్తావిస్తూ ‘అహం బ్రహ్మాస్మి’ పోస్టర్ పెట్టి, దీని గురించి అడిగితే ఆన్సర్ లేదు అంటూ మనోజ్ను ట్యాగ్ చేశాడు.
దీనికి కూడా అదే స్మైలీ ఎమోజీ పెట్టాడే తప్ప మనోజ్ ఈ సినిమా గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. మనోజ్ రెస్పాన్స్ను బట్టి చూస్తే ఈ సినిమాను ఆపేశారని అర్థమవుతుంది. మేకింగ్ దశలో ఉండుంటే మనోజ్ ఇలా సమాధానం దాటవేసేవాడు కాదు, నవ్వే వాడు కాదు. మరి అది కాకపోయినా వేరేదైనా సినిమా అయినా చేస్తాడా లేక సినిమాలే మానుకుంటాడా మనోజ్?
This post was last modified on December 9, 2022 6:07 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…