సౌత్ ఇండియా అనే కాదు.. ఇండియా మొత్ంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది Nayanthara. ఇలాంటి చిత్రాలతో ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేయగల అతి కొద్దిమంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న నయన్.. ఇప్పుడు ‘Connect’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతకు ముందు Nayanthara ప్రధాన పాత్రలో ‘మాయ’ (తెలుగులో మయూరి) తీసిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా చాలా మంచి పేరు సంపాదించిన అశ్విన్.. ఆ తర్వాత తాప్సి ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ అనే మరో థ్రిల్లర్ తీశాడు.
ఇప్పుడు ‘Connect’ కోసం మళ్లీNayanthara తో జట్టు కట్టాడు. ఇందులో వినయ్ రాయ్, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 22న సినిమా తమిళం, తెలుగులో రిలీజ్ కానున్న నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు.
అశ్విన్ తొలి రెండు చిత్రాల్లాగే ఇది కూడా హార్రర్ టచ్ ఉన్న సినిమానే. కాకపోతే ఈసారి అతను విభిన్నమైన ‘లాక్ డౌన్’ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. ఒక కుటుంబంలో అందరూ చాలా హ్యాపీగా ఉన్న టైంలో లాక్ డౌన్ వల్ల ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండిపోవడం.. అలాంటి టైంలోనే Nayanthara ఉన్న ఇంట్లో దయ్యం ప్రవేశించడం.. వీడియో కాల్లో మాట్లాడుతున్న మిగతా వాళ్లకు దయ్యం సంకేతాలు వినిపించి, కనిపించి కంగారు పడడం ఇలా సాగే కథ ఇది.
మామూలుగా అయితే భూత వైద్యుడిని ఇంటికి పిలిపించి ఏవో విరుగుడు చర్యలు చేపట్టి దయ్యాన్ని బయటికి పంపిస్తారు. కానీ లాక్ డౌన్ కావడంతో ఎవరూ ఎటూ కదిలే పరిస్థితి ఉండదు. ఈ స్థితిలో దయ్యాన్ని తరిమేయడానికి నయన్, ఆమె ఫ్యామిలీ ఏం చేసిందన్నదే ఈ సినిమా.
ఇంటర్వెల్ లేకుండా 90 నిమిషాల పాటు నాన్స్టాప్గా నడుస్తుందట ఈ చిత్రం. కాన్సెప్ట్తో పాటు టెక్నికల్గా బ్రిలియంట్ అనిపించింది ట్రైలర్ వరకు చూస్తే. మరి సినిమాగా ‘కనెక్ట్’ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on December 9, 2022 10:55 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…