సోషల్ మీడియా మొత్తం తేరి రీమేక్ వద్దనే ట్రెండ్ తో ఊగిపోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఇంకొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా అప్డేట్ వింటారని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఈ రచ్చ మొదలై గంటల తరబడి కొనసాగుతోంది. నిజానికి తాము తీయబోయేది తేరి రీమేక్ అని ఎవరూ బాహాటంగా చెప్పలేదు. కానీ మైత్రి దగ్గరే హక్కులున్న సంగతి అందరికీ తెలుసు. భవదీయుడు భగత్ సింగ్ ఇప్పట్లో తెరకెక్కే ఛాన్స్ లేదు కాబట్టి ఆ స్థానంలో తేరిని దించుతున్నారని వందలు వేలల్లో నిరసన ప్రకటిస్తూ అభిమానులు పోస్టులు మీమ్స్ పెడుతున్నారు.
వాళ్ళ ఆవేదనలో అర్థం లేకపోలేదు. తేరి దాని ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ టైంలోనే మనకు పోలీసోడిగా థియేటర్లో వచ్చింది. కానీ ఫ్లాప్ అయ్యింది. శాటిలైట్ ఛానల్ లో ఇప్పటికి వారానికి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటుంది. ప్రైమ్ లో హెచ్డి ప్రింట్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఇలా రకరకాల రూపాల్లో ఈ పోలీసోడిని జనం చూస్తూనే ఉన్నారు. అలాంటి కథను తీసుకుని మళ్ళీ తీస్తామంటే కాలకుండా ఉంటుందా. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా రీమేకే కానీ దానికి హరీష్ శంకర్ బోలెడు మసాలా మార్పులు చేసి బ్లాక్ బస్టర్ అందించారు. అప్పుడు దబాంగ్ చూసినవాళ్లు తక్కువ.
దెబ్బకు మైత్రి హ్యాండిల్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. లేట్ అయినా రాత్రి లోపు పెడతారో లేక రేపు ప్లాన్ చేసుకున్నారో తెలియదు. పోనీ తేరి రీమేక్ కాదనుకున్నప్పుడు అదేదో హరీష్ శంకర్ నేరుగా చెప్పేస్తే ఈ గొడవే ఉండదు. కానీ తనూ సైలెంట్ గా ఉండటం అనుమానాలను నిజం చేస్తోంది. తేరి నిజంగా ఒక రొటీన్ పోలీస్ స్టోరీ. విజయ్ ఇమేజ్ తో తమిళంలో ఆడేసింది కానీ మనం బోలెడు చూశాం కాబట్టే ఇక్కడ డిజాస్టర్ చేశాం. ఎంత పవన్ అయినా కాటమరాయుడు, గోపాల గోపాల, భీమ్లా నాయక్ లాంటి రీమేక్ లు అద్భుతాలు చేయలేదుగా. అలాంటప్పుడు తేరితో రిస్క్ చేయడం ఎందుకు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…