మూడు వరుస డిజాస్టర్ల తర్వాత ‘అఖండ’తో బ్లాక్బస్టర్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అదే సమయంలో ‘అన్స్టాపబుల్’ షో సూపర్ హిట్ అయి ఆయన క్రేజ్ను పెంచింది. ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘వీరసింహారెడ్డి’ మంచి హైపే కనిపిస్తోంది. కొత్తగా అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్తో బాలయ్య సినిమాను మొదలుపెట్టేశాడు. మొత్తంగా బాలయ్య విషయంలో ఆల్ హ్యాపీస్ అన్నట్లుంది. కెరీర్లో ఈ దశలో మళ్లీ ఇలాంటి పీక్ చూస్తాడని అభిమానులు ఊహించలేదు.
ఐతే అంతా బాగుందనుకుంటున్న సమయంలో బాలయ్య కొత్త సినిమా గురించి మొదలైన చర్చ అభిమానులను కలవరపెడుతోంది. ఆ చిత్రం.. రామానుజాచార్యుల జీవిత కథ అని అంటున్నారు. సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
కానీ ఎంత పెద్ద కంపెనీ భాగస్వామి అయినా.. ఎన్ని భాషల్లో తీసినా.. ఎంత బడ్జెట్ పెట్టినా.. బాలయ్య లాంటి మాస్ హీరోను ఆధ్యాత్మిక చిత్రంలో చూడడానికి అంతగా ఇష్టపడరన్నది వాస్తవం. ఈ తరహా చిత్రాలకు మంచి పేరొస్తుంది కానీ.. డబ్బులు రావు. కమర్షియల్గా వర్కవుట్ అయ్యే సినిమాలు కావివి. అందులోనూ సి.కళ్యాణ్ ట్రాక్ రికార్డు కూడా బాలయ్య అభిమానులను భయపెట్టేదే.
ఒకప్పుడు ‘సింహా’తో బాలయ్య మళ్లీ ఫాం అందుకుని ఉత్సాహంగా ఉన్న టైంలో ‘పరమవీర చక్ర’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ ఇచ్చిన నిర్మాత కళ్యాణే. పూర్తిగా టచ్ కోల్పోయిన దాసరి నారాయణ రావుతో ఈ సినిమా తీయించి బాలయ్యకు చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఇక ‘లెజెండ్’తో మళ్లీ ఫాం అందుకున్నాక మళ్లీ బాలయ్యను ట్రాక్ తప్పించింది కూడా కళ్యాణే. కె.ఎస్.రవికుమార్ లాంటి మరో ఔట్ డేట్ డైరెక్టర్ని పెట్టి బాలయ్యతో ‘జైసింహా’, ‘రూలర్’ లాంటి సినిమాలు తీశాడు కళ్యాణ్. ఇందులో ‘జై సింహా’ పర్వాలేదనిపించింది కానీ.. ‘రూలర్’ పెద్ద డిజాస్టర్ అయింది. తనతో ఇలాంటి సినిమాలు తీసిన కళ్యాణ్ను నమ్మి, బాలయ్య ఒక ఆధ్యాత్మిక చిత్రం చేస్తానంటే అభిమానులు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.
This post was last modified on December 8, 2022 9:37 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…