యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు చాలా దగ్గరగా ఉండే సినిమాలు చేసే హీరోల్లో అడివి శేష్ ఒకడు. క్షణం దగ్గర్నుంచి అతడి ప్రతి సినిమా యుఎస్లో బాగా ఆడుతోంది. ఐతే స్టార్ ఇమేజ్ లేకపోవడం వల్ల ఇంతకుముందు శేష్ సినిమాలు భారీ వసూళ్లు సాధించలేకపోయాయి కానీ.. లేదంటే క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరాల్సినవే.
ఐతే ‘మేజర్’ టైంకి శేష్ ఇమేజ్ కొంచెం పెరిగి 8 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఐతే ‘హిట్-2’ సినిమాకు ఉన్న హైప్ చూస్తే.. పాజిటివ్ టాక్ వస్తే ఇది శేష్కు తొలి మిలియన్ డాలర్ మూవీగా నిలవడం ఖాయం అనుకున్నారు. ప్రి రిలీజ్ హైప్ బాగుండడం.. తొలి రోజు టాక్ కూడా బాగుండడంతో అంచనాలకు తగ్గట్ల యుఎస్ బాక్సాఫీస్లో దూసుకెళ్లింది ‘హిట్-2’. ప్రిమియర్లతోనే 2 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం వీకెండ్ అయ్యేసరికి 6 లక్షల డాలర్ల మార్కును అందుకుంది.
ఆ తర్వాత వీక్ డేస్లు వసూళ్లు తగ్గినా.. డ్రాప్ మరీ ఎక్కువేమీ లేదు. మంగళవారానికే ఈ చిత్రం 8.5 లక్షల డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. గురువారం మొత్తం షోలు అయ్యేసరికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్కును అందుకోబోతుండడం లాంఛనమే. ప్రిమియర్లతో కలిపి వారం తిరిగేసరికి ‘హిట్-2’ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్లు ఏమీ లేవు. దీంతో రెండో వీకెండ్లో కూడా ‘హిట్-2’ యుఎస్ తెలుగు బాక్సాఫీస్ను రూల్ చేయడం గ్యారెంటీ. ఈ నెల 16న ‘అవతార్-2’ వచ్చే వరకు ‘హిట్-2’కు ఎదురు లేనట్లే.
ఫుల్ రన్లో ఈ సినిమా 1.5 మిలియన్ మార్కును కూడా టచ్ చేసే అవకాశాలున్నాయి. ‘హిట్-2’ ఓవరాల్ వసూళ్లు రూ.20 కోట్ల షేర్ మార్కుకు దగ్గరగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడా సినిమా మంచి సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on December 8, 2022 5:39 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…