సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నుంచి మలైకా అరోరా విడిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే సినిమాల్లో మలైకా పెద్ద పేరు సంపాదించకపోయినా.. బాలీవుడ్లో ఓ పెద్ద కుటుంబానికి కోడలైంది. అర్బాజ్తో కలిసి దశాబ్దంన్నర పాటు అన్యోన్యంగా వైవాహిక జీవితం సాగించింది. వాళ్లిద్దరి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లవుతున్న తరుణంలో ఆమె భర్త నుంచి విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీనికి మించిన షాక్ ఏంటంటే.. తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన యువ కథానాయకుడు అర్జున్ కపూర్తో మలైకా కొత్త బంధం మొదలుపెట్టడం. ఐదారేళ్ల నుంచి అతడితోనే సహజీవనం చేస్తున్న మలైకా.. తన మాజీ భర్త గురించి ఇప్పటికీ చాలా పాజిటివ్గానే మాట్లాడుతుండడం విశేషం. తమ దారులు వేరు కావడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది కానీ.. అర్బాజ్ చాలా మంచోడని, తనంటే అతడికి చాలా ప్రేమ అని ఆమె ఒక షోలో వెల్లడించింది.
అర్బాజ్కు మొదట ప్రపోజ్ చేసింది కూడా తనేనని ఈ షోలో మలైకా వెల్లడించడం విశేషం. ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. అర్బాజ్కు మొదట ప్రపోజ్ చేసింది నేనే. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది, మీరు సిద్ధంగా ఉన్నారా అని తనే అతణ్ని అడగ్గా.. అర్బాజ్ వెంటనే ఒప్పకున్నాడు. ఐతే జీవితంలో మేం విభిన్న అంశాలను కోరుకోవడంతో విడిపోయాం. కానీ ఆయన ఎంతో మంచి వ్యక్తి. నన్ను ఎంతో మార్చాడు. ఈ రోజు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం.
ఇంకా అర్బాజ్కు నా మీద ప్రేమ తగ్గలేదు. ఇటీవల నాకో ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే అక్కడ నా కోసం వేచి ఉన్నాడు అంటూ తన మాజీ భర్తపై ప్రశంసలు కురిపించింది మలైకా. ఇదిలా ఉండగా.. మలైకా త్వరలోనే అర్జున్ను పెళ్లాడబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 8, 2022 6:39 am
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…
వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…
ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…
ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…
హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…