బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గత ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తరాదిన పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నాక పెద్ద స్థాయిలో రిలీజ్ అయిన ‘సూర్యవంశీ’ సినిమాతోనే బాలీవుడ్ రివైవ్ అయింది. అప్పుడు అందరూ అతణ్ని సేవియర్ అన్నారు. కానీ ఆ ఊపును తర్వాత అక్షయ్ కొనసాగించలేకపోయాడు. ఈ ఏడాది ఒకటి రెండు కాదు.. ఐదు డిజాస్టర్లను అతను ఖాతాలో వేసుకున్నాడు.
థియేటర్లలో రిలీజైన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు.. ఓటీటీలో విడుదలైన కట్ పుట్లి అతడికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. దీంతో ఒక్కసారిగా అక్షయ్ కుమార్ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లు కనిపించింది. స్వయంగా అభిమానులే అతణ్ని డిస్ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ట్రెండుకు తగ్గట్లుగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేద్దామని ఛత్రపతి శివాజీ కథను లైన్లో పెట్టాడు.
మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుంచి చిన్న వీడియో గ్లింప్స్ను మంగళవారమే రిలీజ్ చేశారు. ఇలా సినిమా అనౌన్స్ అయిందో లేదో కాసేపటికే ట్రోల్స్ మొదలైపోయాయి. ఒక రాజమహల్లో అక్షయ్ నడిచి వస్తున్న వీడియోలో వెనుక ట్యూబ్ లైట్లతో కూడిన భారీ జూమర్ ఈ ట్రోల్స్కు కారణమైంది.
శివాజీ బతికి ఉన్న కాలానికి ప్రపంచంలో ఎక్కడా విద్యుత్ కానీ, ట్యూబ్ లైట్ కానీ లేవు. అప్పటికి థామస్ అల్వా ఎడిసన్ బల్బునే కనిపెట్టలేదు. మరి ఆ కాలంలో సినిమా తీస్తూ ఇప్పటి టెక్నాలజీ జూమర్ను ఏర్పాటు చేయడం ఏంటి.. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటూ నెటిజన్లు ఈ చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలే ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ ట్రోల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సినిమాల మీద నెగెటివిటీని పెంచడానికి ఒక వర్గం కాచుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక లోపం కనిపించేసరికి అక్షయ్ సినిమా మీద నెటిజన్లు పడిపోతున్నారు.
This post was last modified on December 7, 2022 8:08 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…