హీరోయిన్లు 30 ప్లస్లోకి రాగానే వారి పెళ్లి గురించి చర్చ మొదలైపోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ మధ్య ఆమె వివాహం గురించి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. తమ్మూ ఒక వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్లు కొన్ని రోజుల కిందట జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై తమన్నా చాలా ఫన్నీగా స్పందించింది. తనకు సంబంధం చూసి పెట్టినందుకు థ్యాంక్స్ అంటూ మీడియా, సోషల్ మీడియా జనాలకు కౌంటర్ వేసింది.
అలా అని తాను పెళ్లి చేసుకోనని, తన ఇంట్లో ఆ చర్చ ఏమీ లేదని చెప్పట్లేదు తమన్నా. ఇంట్లో తన పెళ్లి గురించిన చర్చ కొంత కాలంగా జోరుగా నడుస్తోందని.. తనకు సంబంధాలు కూడా చూస్తున్నారని తమన్నా వెల్లడించడం విశేషం. తన కొత్త చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించింది మిల్కీ బ్యూటీ.
“మామూలుగా అందరి ఇళ్లలో అమ్మాయిలకు పెళ్లి చేసే విషయంలో ప్రెజర్ ఉన్నట్లే మా ఇంట్లో కూడా ఎప్పట్నుంచో నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు” అని తమన్నా తెలిపింది. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, కామెంట్లపై తమన్నా స్పందిస్తూ.. ‘‘వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. ఇలా రూమర్లు పుట్టించడం, కామెంట్లు చేయడం వారి జీవితంలో భాగం. నటించడం అన్నది మా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ను నేనంత సీరియస్గా తీసుకోను’’ అని చెప్పింది.
సత్యదేవ్ గురించి మాట్లాడుతూ.. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో తన నటన చాలా సహజంగా అనిపించిందని, అప్పట్నుంచో అతడితో నటించాలని అనుకున్నానని.. ‘గుర్తుందా శీతాకాలం’తో ఆ కోరిక తీరిందని తమ్మూ పేర్కొంది. హీరోల్లో తాను పెద్ద హీరో చిన్న హీరో అని తేడాలు చూడనని.. ఎవరితోనైనా సినిమాను సినిమాలాగే చూస్తానని, కథే ముఖ్యమని తమన్నా అభిప్రాయపడింది.
This post was last modified on December 7, 2022 11:53 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…