కరోనా టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నారప్పని నేరుగా ఓటిటి రిలీజ్ చేసిన నిర్మాత సురేష్ బాబు దాని వల్ల సేఫ్ గా లాభాలైతే పొందారు కానీ అభిమానులు మాత్రం తమ హీరో మాస్ ర్యాంపేజ్ ని థియేటర్లో చూడలేదని తెగ ఫీలైపోయారు. దాని కోసమే ఎఫ్3 క్లైమాక్స్ లో చిన్న బిట్ పెట్టి మేనేజ్ చేస్తే అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా కాలం తర్వాత వెంకీ చేసిన పక్కా విలేజ్ మాస్ పాత్ర నారప్ప. ధనుష్ అసురన్ ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల యధాతధంగా తీసినప్పటికీ నారప్పకి డిజిటల్ ఆడియన్స్ నుంచి మద్దతు దక్కి బొమ్మ సూపర్ హిట్ అనిపించుకుంది.
సరే లేట్ అయితే అయ్యిందని మొత్తానికి నారప్పని బిగ్ స్క్రీన్ మీద తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టినరోజుని పురస్కరించుకుని కేవలం ఒక్క రోజు వరల్డ్ వైడ్ థియేట్రికల్ విడుదల చేయబోతున్నారు. సెంటర్ ని బట్టి డిమాండ్ ని బట్టి రెండు నుంచి నాలుగు ఆటల వరకు స్క్రీనింగ్ ఉంటుంది. ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇప్పట్లో చూసే అవకాశం ఉండదు. దృశ్యం 2 కూడా ఓటిటిలోనే వచ్చినప్పటికీ దానికన్నా వెండితెర మీద చూసేందుకు నారప్పనే రైట్ ఛాయస్. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు చెప్పనున్నారు. నాని వికి ఇలాగే చేశారు కానీ వర్కౌట్ కాలేదు.
రీ రిలీజులు బాగా జోరు మీదున్న టైంలో నారప్పని ఇలా తీసుకురావడం బాగుంది. ఒక రోజు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ బాబాని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. ఇక్కడ అంత స్పందన ఉండదు కాబట్టి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆలోచన చేయలేదు. నెలకు కనీసం అయిదారు రీరిలీజులతో డిస్ట్రిబ్యూటర్లు బాగానే సొమ్ములు చేసుకుంటున్నారు కానీ ఈ క్రమంలో డిజాస్టర్లను కూడా తీసుకురావడం వల్ల మెల్లగా వీటి మీద ఆసక్తి సన్నగిల్లుతోంది. నిజానికి వెంకీ బర్త్ డేకి బొబ్బిలిరాజా లేదా జయం మనదేరా ప్లాన్ చేశారు కానీ ఫైనల్ గా నారప్ప లాక్ అయ్యిందని స్టూడియో టాక్
This post was last modified on December 6, 2022 5:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…