పరిశ్రమలో ఒక పెద్ద సక్సెస్ వచ్చినంత మాత్రాన ఆది వరసగా అవకాశాలు తెస్తుందేమో కానీ అనుకోకుండా పడే బ్రేకులను, వచ్చే ఫ్లాపులను ఆపలేదు. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి 2022 బొత్తిగా కలిసి రావడం లేదు. వరస పరాజయాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడాది చివరిలో శ్యాం సింగ రాయ్, ఈ సంవత్సరం సంక్రాంతి బంగార్రాజుతో బోణీ బాగానే జరిగింది కానీ ఆ తర్వాత అసలైన బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అతి తక్కువ టైంలో కోటి దాటిన రెమ్యునరేషన్ మెల్లగా తగ్గే సూచనలు ప్రారంభమయ్యాయి.
రామ్ తో చేసిన ది వారియర్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం అసలు వచ్చిందనే సంగతి కూడా గుర్తు లేనంత దారుణంగా తేడా కొట్టింది. తననే టైటిల్ రోల్ తో డబుల్ ఫోటోలో ఇంద్రగంటి తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అయితే మరీ అన్యాయంగా ఓటిటిలో వచ్చాక కూడా ఎవరూ పట్టించుకోలేదు. సరే కోలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుందామని సూర్యతో వచ్చిన అవకాశాన్ని ఎగిరి గంతేసి ఒప్పుకుంది. శివ పుత్రుడు ఫేమ్ బాలా దర్శకుడు కావడంతో ఇంకేం పెద్ద బ్రేకే దొరుకుతుందని ఆశ పడింది. కట్ చేస్తే ఇప్పుడది ఏకంగా ఆగిపోయి సూర్య తప్పుకున్నాడు.
వేరొకరితో మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ బాలా తీస్తానన్నా ఏదో మీడియం రేంజ్ హీరో దొరుకుతాడు తప్ప సూర్య స్టేచర్ ఉన్న స్టార్ అసాధ్యం. అలాంటప్పుడు కీర్తి సైతం డ్రాప్ కావడం మినహా వేరే ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం టోవినో థామస్ తో కలిసి అజయంటే రండం మోషణంతో మలయాళం ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్ల కొరత వల్ల పూజా హెగ్డే, రష్మిక మందన్న తర్వాత వాళ్ళను దాటడమే టార్గెట్ గా పెట్టుకున్న కృతి శెట్టి ఈ వరస షాకులు ఇబ్బంది కలిగించేవే. మహేష్ బాబు, రామ్ చరణ్, తారక్, బన్నీలతో నటించే ఆఫర్లు రావాలంటే పెద్ద బ్లాక్ బస్టర్లే పడాలి.
This post was last modified on December 6, 2022 1:28 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…