పరిశ్రమలో ఒక పెద్ద సక్సెస్ వచ్చినంత మాత్రాన ఆది వరసగా అవకాశాలు తెస్తుందేమో కానీ అనుకోకుండా పడే బ్రేకులను, వచ్చే ఫ్లాపులను ఆపలేదు. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి 2022 బొత్తిగా కలిసి రావడం లేదు. వరస పరాజయాలు మార్కెట్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడాది చివరిలో శ్యాం సింగ రాయ్, ఈ సంవత్సరం సంక్రాంతి బంగార్రాజుతో బోణీ బాగానే జరిగింది కానీ ఆ తర్వాత అసలైన బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అతి తక్కువ టైంలో కోటి దాటిన రెమ్యునరేషన్ మెల్లగా తగ్గే సూచనలు ప్రారంభమయ్యాయి.
రామ్ తో చేసిన ది వారియర్ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం అసలు వచ్చిందనే సంగతి కూడా గుర్తు లేనంత దారుణంగా తేడా కొట్టింది. తననే టైటిల్ రోల్ తో డబుల్ ఫోటోలో ఇంద్రగంటి తీసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అయితే మరీ అన్యాయంగా ఓటిటిలో వచ్చాక కూడా ఎవరూ పట్టించుకోలేదు. సరే కోలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుందామని సూర్యతో వచ్చిన అవకాశాన్ని ఎగిరి గంతేసి ఒప్పుకుంది. శివ పుత్రుడు ఫేమ్ బాలా దర్శకుడు కావడంతో ఇంకేం పెద్ద బ్రేకే దొరుకుతుందని ఆశ పడింది. కట్ చేస్తే ఇప్పుడది ఏకంగా ఆగిపోయి సూర్య తప్పుకున్నాడు.
వేరొకరితో మొదలుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ బాలా తీస్తానన్నా ఏదో మీడియం రేంజ్ హీరో దొరుకుతాడు తప్ప సూర్య స్టేచర్ ఉన్న స్టార్ అసాధ్యం. అలాంటప్పుడు కీర్తి సైతం డ్రాప్ కావడం మినహా వేరే ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం టోవినో థామస్ తో కలిసి అజయంటే రండం మోషణంతో మలయాళం ఎంట్రీ ఇస్తోంది. హీరోయిన్ల కొరత వల్ల పూజా హెగ్డే, రష్మిక మందన్న తర్వాత వాళ్ళను దాటడమే టార్గెట్ గా పెట్టుకున్న కృతి శెట్టి ఈ వరస షాకులు ఇబ్బంది కలిగించేవే. మహేష్ బాబు, రామ్ చరణ్, తారక్, బన్నీలతో నటించే ఆఫర్లు రావాలంటే పెద్ద బ్లాక్ బస్టర్లే పడాలి.
This post was last modified on December 6, 2022 1:28 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…