Movie News

రవితేజ బ్రాండు పని చేయలా..

మాస్ రాజా రవితేజ తెలుగులో తాను నటించిన కొన్ని చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అవి కాక అతను ఈ మధ్య తమిళ సినిమాలను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎలా కుదిరిందో ఏమో కానీ.. తమిళ హీరో విష్ణు విశాల్‌తో అతడికి మంచి స్నేహం కుదిరి ఆల్రెడీ అతను నటించిన ‘ఎఫ్ఐఆర్’ అనే చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేశాడు.

అది మంచి సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. అయినా నిరాశ చెందకుండా విష్ణు విశాల్ కొత్త సినిమాలోనూ రవితేజ భాగస్వామి అయ్యాడు. విష్ణు, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు అనే యువ దర్శకుడు రూపొందించిన ‘మట్టి కుస్తీ’ చిత్రాన్ని తెలుగులో రవితేజ సమర్పించాడు. ఈ చిత్రానికి నిర్మాత విష్ణునే. ఈ సినిమాకు టాక్ అయితే బాగుంది కానీ.. తెలుగు ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

అజయ్, శత్రు లాంటి తెలుగు నటులు కీలక పాత్రలు పోషించినా.. డబ్బింగ్ అంతా కూడా బాగానే చేసినా.. అన్నింటికీ మించి టాక్ బాగున్నా ‘మట్టి కుస్తీ’ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. తొలి రోజు మార్నింగ్ షో నుంచి ఏ దశలోనూ సినిమా పైకి లేవలేదు. మన వాళ్ల ఫోకస్ మొత్తం ‘హిట్-2’ మీదే ఉండి అందరూ దాని కోసమే ఎగబడుతున్నారు. ‘మట్టి కుస్తీ’ అనే పేరు, ప్రోమోలు చూసి ఇదేదో ‘దంగల్’ టైపు కుస్తీ సినిమా అనుకున్నారు కానీ.. నిజానికి ఇది పక్కా ఫ్యామిలీ మూవీ.

కుస్తీ అనేది సబ్ ప్లాట్ మాత్రమే. రవితేజకు ఈ కథ బాగా నచ్చేసి తనే తెలుగులో చేయాలని కూడా అనుకున్నాడట. కానీ విష్ణు ఒప్పుకోకుండా దీన్ని బహుభాషా చిత్రంంగా చేసి తెలుగులో రిలీజ్ చేశాడు. కానీ ఎంత కష్టపడ్డా అతడికి ఈ సారి కూడా తెలుగులో గుర్తింపు దక్కలేదు. రవితేజ బ్రాండు కూడా ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడనట్లే కనిపిస్తోంది.

This post was last modified on December 5, 2022 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

5 minutes ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

10 minutes ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

13 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago