మాస్ రాజా రవితేజ తెలుగులో తాను నటించిన కొన్ని చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అవి కాక అతను ఈ మధ్య తమిళ సినిమాలను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎలా కుదిరిందో ఏమో కానీ.. తమిళ హీరో విష్ణు విశాల్తో అతడికి మంచి స్నేహం కుదిరి ఆల్రెడీ అతను నటించిన ‘ఎఫ్ఐఆర్’ అనే చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేశాడు.
అది మంచి సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. అయినా నిరాశ చెందకుండా విష్ణు విశాల్ కొత్త సినిమాలోనూ రవితేజ భాగస్వామి అయ్యాడు. విష్ణు, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు అనే యువ దర్శకుడు రూపొందించిన ‘మట్టి కుస్తీ’ చిత్రాన్ని తెలుగులో రవితేజ సమర్పించాడు. ఈ చిత్రానికి నిర్మాత విష్ణునే. ఈ సినిమాకు టాక్ అయితే బాగుంది కానీ.. తెలుగు ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
అజయ్, శత్రు లాంటి తెలుగు నటులు కీలక పాత్రలు పోషించినా.. డబ్బింగ్ అంతా కూడా బాగానే చేసినా.. అన్నింటికీ మించి టాక్ బాగున్నా ‘మట్టి కుస్తీ’ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. తొలి రోజు మార్నింగ్ షో నుంచి ఏ దశలోనూ సినిమా పైకి లేవలేదు. మన వాళ్ల ఫోకస్ మొత్తం ‘హిట్-2’ మీదే ఉండి అందరూ దాని కోసమే ఎగబడుతున్నారు. ‘మట్టి కుస్తీ’ అనే పేరు, ప్రోమోలు చూసి ఇదేదో ‘దంగల్’ టైపు కుస్తీ సినిమా అనుకున్నారు కానీ.. నిజానికి ఇది పక్కా ఫ్యామిలీ మూవీ.
కుస్తీ అనేది సబ్ ప్లాట్ మాత్రమే. రవితేజకు ఈ కథ బాగా నచ్చేసి తనే తెలుగులో చేయాలని కూడా అనుకున్నాడట. కానీ విష్ణు ఒప్పుకోకుండా దీన్ని బహుభాషా చిత్రంంగా చేసి తెలుగులో రిలీజ్ చేశాడు. కానీ ఎంత కష్టపడ్డా అతడికి ఈ సారి కూడా తెలుగులో గుర్తింపు దక్కలేదు. రవితేజ బ్రాండు కూడా ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడనట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 5, 2022 2:19 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ…