2024 ఎన్నికల కోసం సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిన స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలకు మహా అయితే ఇంకో రెండు మూడు నెలలకు మించి సమయం కేటాయించే పరిస్థితి లేదు. ఈ లోపు హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయించాలని దాని దర్శక నిర్మాతలు కష్టపడుతున్నారు.
ఎన్నికలకు ముందు ఇంకో సినిమా మొదలుపెట్టి పూర్తి చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ పవన్ అందరికీ పెద్ద షాకిస్తూ సుజీత్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రకటించేసింది. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు. కాంబినేషన్ ఎగ్జైట్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.
ఐతే పవన్ త్వరలోనే అభిమానులకు ఇంకో పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండేళ్ల ముందే అనౌన్స్ చేసిన సినిమాకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంకో వారం రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ సినిమాల ప్రొడక్షన్, పీఆర్ వ్యవహారాలు చూసే సతీష్ బొట్ట ట్విట్టర్లో ప్రకటించగా.. హరీష్ శంకర్ సైతం ఈ ట్వీట్పై స్పందించాడు. ఈ కాంబో క్రేజ్ గురించి ఇచ్చిన ఎలివేషన్కు థ్యాంక్స్ చెప్పాడు.
దీన్ని బట్టి చూస్తే వచ్చే వారం పవన్-హరీష్ మూవీకి ప్రారంభోత్సవం జరపబోతుండడం నిజమే అనుకోవచ్చు. ఐతే ఊరికే నామమాత్రంగా ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తే ప్రయోజనం ఏముంటుంది? సినిమా ముందుకు కదిలితేనే హరీష్కైనా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలకైనా సంతోషం. కానీ అదైతే ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
This post was last modified on December 5, 2022 7:22 am
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…