‘హిట్-2’ థియేటర్లలోకి దిగేసింది. ‘హిట్-3’ విషయంలో సస్పెన్స్ కూడా వీడిపోయింది. కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ‘హిట్’ ఫ్రాంఛైజీ మూడో సినిమాలో నేచురల్ స్టార్ నానీనే హీరోగా నటించబోతున్నాడు. కొత్త దర్శకుడైన శైలేష్ కొలనును నమ్మి హిట్ ఫ్రాంఛైజీలో వరుసగా రెండు సినిమాలు నిర్మించిన నాని.. వాటితో కమర్షియల్గా మంచి ఫలితాన్నే అందుకున్నాడు. ‘హిట్’ డీసెంట్ హిట్ కాగా.. ‘హిట్-2’కు బంపర్ క్రేజ్ వచ్చింది.
పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం వచ్చేలా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ‘హిట్-3’కి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాని. ఐతే మీడియాలో ప్రచారం జరిగినట్లు నిజంగానే ‘హిట్-3’లో నాని హీరోగా నటిస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ‘హిట్-2’ చివర్లో ఆ సస్పెన్సుకు తెరదించేశారు. రూత్ లెస్ పోలీసాఫీసర్ పాత్రలో నాని సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం.. అతను మామూలోడు కాదంటూ పక్కనున్న వాళ్లు బిల్డప్ ఇవ్వడం.. ‘హిట్: ది థర్డ్ కేస్’ అని టైటిల్ పడడం జరిగాయి.
నాని ఎంట్రీతో ‘హిట్-2’ థియేటర్లు హోరెత్తిపోతున్న మాట వాస్తవం. కాకపోతే ఎక్కువగా కెరీర్లో సాఫ్ట్ క్యారెక్టర్లే చేశాడు నాని. పోలీస్ పాత్రలో ఇప్పటిదాకా కనిపించింది లేదు. అలాంటోడు రూత్ లెస్ పోలీసాఫీసర్ పాత్రలో ఎలా మెప్పిస్తాడన్నది ఆసక్తికరం. ‘హిట్-2’కు టాక్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ.. మరీ ట్రైలర్తో పెరిగిన అంచనాలను సినిమా అందుకోలేకపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతిమంగా ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంటుందా.. చిత్ర బృందం అంచనా వేస్తున్న స్థాయిలో పెద్ద హిట్ అవుతుందా అన్నది కూడా ఆసక్తికరం.
సినిమా రిజల్ట్ అయితే నెగెటివ్గా ఉండదు కాబట్టి ‘హిట్-3’ పట్టాలెక్కడం గ్యారెంటీ. కానీ ‘హిట్-2’ మీద కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా పడుతున్న నేపథ్యంలో ఆ సినిమా మరింత మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ‘హిట్’ ఫ్రాంఛైజీ సినిమాలంటే ఒక ఫార్మాట్లో నడుస్తాయి అనే అభిప్రాయాన్ని కూడా ఆ చిత్రంతో బ్రేక్ చేయాల్సిందే. కాబట్టి నాని-శైలేష్ల ముందు పెద్ద టాస్క్ ఉందనడంలో సందేహం లేదు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…