Movie News

అడివి శేష్.. ఆస్కార్ సినిమా

అడివి శేష్ అంటే టాలీవుడ్లో ఇప్పుడొక బ్రాండ్. కెరీర్ ఆరంభంలో నటుడిగా, దర్శకుడిగా ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. తర్వాత జాగ్రత్తగా అడుగులు వేశాడు. రచయితగా, హీరోగా చాలా మంచి పేరు సంపాదించాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ సినిమాలు అతడి రాత మార్చేశాయి.

తన రేంజ్ పెంచేశాయి. శేష్ సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని నమ్మి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెద్దదే. తాజాగా ‘హిట్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేష్. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వస్తోంది.

దీని తర్వాత శేష్ చేసే సినిమాల విషయంలో ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ తాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు శేష్. కానీ దాని దర్శకుడెవరనే విషయంలో క్లారిటీ లేదు. ఇది కాక గూఢచారి-2 కూడా లైన్లో ఉంది. 

ఇవి కాక శేష్ ఒక ఇంట్రెస్ట్రింగ్ ప్రాజెక్టు గురించి వెల్లడించాడు. ‘హిట్-2’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఒక ఆస్కార్ విన్నింగ్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్లు తెలిపాడు. ఒరిజినల్‌ను నిర్మంచిన హాలీవుడ్ నిర్మాణ సంస్థే ఈ చిత్రాన్ని తెలుగులో ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు శేష్ చెప్పడం విశేషం.

ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుందని అతను తెలిపాడు. మరి ఆ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఏదో.. దాన్ని నిర్మించే ప్రొడక్షన్ హౌస్ ఏదో.. ఈ చిత్రానికి దర్శకుడెవరో చూడాలి. ఆ ఒరిజినల్ ఏదో మన జనాలకు తెలిస్తే దాన్ని చూడడం మొదలుపెడతారనడంలో సందేహం లేదు. ఇక ‘గూఢచారి-2’ గురించి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు మూల కథ కుదిరిందని.. దాన్ని స్క్రిప్టుగా తీర్చిదిద్దాలని.. తన టీంతో కలిసి ఆ పనిలోనే ఉన్నానని.. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి టైం పడుతుందని చెప్పాడు. 

This post was last modified on December 2, 2022 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago