Movie News

పూనమ్ కౌర్‌కు ఏమైంది?

ఈ మధ్యే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అనారోగ్యం గురించి తెలిసి అందరూ షాకైపోయారు. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ అనారోగ్యం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఆమే.. పూనమ్ కౌర్. సమంత లాగే పూనమ్ సైతం అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. ఆ వ్యాధి పేరు.. ఫైబ్రో మయోల్జియా. నిద్ర లేమి, కండరాల నొప్పులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడం ఈ వ్యాధి లక్షణాలట.

పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయోల్జియా ఉన్నట్లుగా నవంబరు 18న నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటి నుంచి కొంత కాలం అలోపతీలోనే చికిత్స తీసుకున్న పూనమ్.. తర్వాత కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల అనంతరం పుణెకు చేరుకుని అక్కడ తన సోదరి ఇంట్లో విశ్రాంతి పొందుతున్నట్లు తెలుస్తోంది. పూనమ్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లుగా ఆమె టీం మీడియాకు సమాచారం ఇచ్చింది. సమంత సైతం కొంత కాలం అలోపతీ చికిత్స తర్వాత కేరళకు వెళ్లి ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోగా ఉపశమనం వచ్చినట్లు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మాయాజాలం’తో పూనమ్ టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వినాయకుడు, గగనం, శ్రీనివాస కళ్యాణం సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆమె క్లిక్ కాలేకపోయింది. ఐతే పూనమ్ వ్యక్తిగత జీవితం తాలూకు పలు విషయాలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరును ముడిపెట్టి అనేక వివాదాలు తలెత్తాయి. ఇటవల ఆమె రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత మళ్లీ అనారోగ్య సమస్యతో వార్తల్లోకి వచ్చింది.

This post was last modified on December 1, 2022 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago