Movie News

పూనమ్ కౌర్‌కు ఏమైంది?

ఈ మధ్యే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అనారోగ్యం గురించి తెలిసి అందరూ షాకైపోయారు. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ అనారోగ్యం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఆమే.. పూనమ్ కౌర్. సమంత లాగే పూనమ్ సైతం అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. ఆ వ్యాధి పేరు.. ఫైబ్రో మయోల్జియా. నిద్ర లేమి, కండరాల నొప్పులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడం ఈ వ్యాధి లక్షణాలట.

పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయోల్జియా ఉన్నట్లుగా నవంబరు 18న నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటి నుంచి కొంత కాలం అలోపతీలోనే చికిత్స తీసుకున్న పూనమ్.. తర్వాత కేరళలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల అనంతరం పుణెకు చేరుకుని అక్కడ తన సోదరి ఇంట్లో విశ్రాంతి పొందుతున్నట్లు తెలుస్తోంది. పూనమ్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లుగా ఆమె టీం మీడియాకు సమాచారం ఇచ్చింది. సమంత సైతం కొంత కాలం అలోపతీ చికిత్స తర్వాత కేరళకు వెళ్లి ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోగా ఉపశమనం వచ్చినట్లు మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మాయాజాలం’తో పూనమ్ టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వినాయకుడు, గగనం, శ్రీనివాస కళ్యాణం సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆమె క్లిక్ కాలేకపోయింది. ఐతే పూనమ్ వ్యక్తిగత జీవితం తాలూకు పలు విషయాలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆమె పేరును ముడిపెట్టి అనేక వివాదాలు తలెత్తాయి. ఇటవల ఆమె రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత మళ్లీ అనారోగ్య సమస్యతో వార్తల్లోకి వచ్చింది.

This post was last modified on December 1, 2022 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

20 minutes ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

37 minutes ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

2 hours ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

2 hours ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

2 hours ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

3 hours ago