గత పదేళ్లలో సౌత్ ఇండియన్ యూత్కు పిచ్చెక్కించేసిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. మలయాళ సినిమాలు వేరే రాష్ట్రాల వారికి పెద్దగా పట్టని సమయంలో విడుదలైన ఈ చిత్రాన్ని దక్షిణాదిన అంతటా ఎగబడి చూశారు. తెలుగులో ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితమే అందుకున్నా సరే.. ఒరిజినల్ ఇచ్చిన ఫీలే వేరు. ఈ సినిమాతో కల్ట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు అల్ఫాన్సో పుతెరిన్. అతడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
కానీ ‘ప్రేమమ్’ తర్వాత అతడి తర్వాతి ఫీచర్ ఫిలిం కోసం అభిమానులు ఏడేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మధ్యలో ‘అవియల్’ అనే తమిళ ఆంథాలజీ ఫిలింలో ఒక పార్ట్ డైరెక్ట్ చేసిన అల్ఫాన్సో.. ఫుల్ లెంగ్త్ సినిమా తీయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘గోల్డ్’. మలయాళం టాప్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రమిది.
గురువారమే ‘గోల్డ్’ థియేటర్లలోకి దిగింది. మార్నింగ్ షోల టాక్ చాలా బాగుంది. ఇది అల్ఫాన్సో మార్కు సినిమా అంటున్నారు. టీజర్ తరహాలోనే సినిమా కూడా క్రేజీ క్రేజీగా ఉందని.. వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని అంటున్నారు. ‘గోల్డ్’తో మళ్లీ అల్ఫాన్సో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయబోతున్నాడని అంటున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘గోల్డ్’ సినిమాను అల్ఫాన్సో రిలీజ్ ముంగిట అసలు ప్రమోట్ చేయలేదు. కనీసం ట్రైలర్ కూడా లాంచ్ చేయకపోవడం గమనార్హం. ఇక ప్రెస్ మీట్లు, ప్రి రిలీజ్ ఈవెంట్ల సంగతి సరేసరి. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక క్రేజీ టీజర్ మినహా ఏ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయలేదు. ఆ టీజర్ కూడా సినిమా గురించి పెద్దగా ఐడియా ఇచ్చిందేమీ లేదు. ఇక రిలీజ్ ముంగిట ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చాడు అల్ఫాన్సో. అందులో తన ‘నేరమ్’, ‘ప్రేమమ్’ చిత్రాల్లాగే ‘గోల్డ్’ కూడా పర్ఫెక్ట్ కాని సినిమా అని.. కానీ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా ఉంది.
This post was last modified on December 1, 2022 6:20 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…