గత పదేళ్లలో సౌత్ ఇండియన్ యూత్కు పిచ్చెక్కించేసిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. మలయాళ సినిమాలు వేరే రాష్ట్రాల వారికి పెద్దగా పట్టని సమయంలో విడుదలైన ఈ చిత్రాన్ని దక్షిణాదిన అంతటా ఎగబడి చూశారు. తెలుగులో ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితమే అందుకున్నా సరే.. ఒరిజినల్ ఇచ్చిన ఫీలే వేరు. ఈ సినిమాతో కల్ట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు అల్ఫాన్సో పుతెరిన్. అతడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
కానీ ‘ప్రేమమ్’ తర్వాత అతడి తర్వాతి ఫీచర్ ఫిలిం కోసం అభిమానులు ఏడేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మధ్యలో ‘అవియల్’ అనే తమిళ ఆంథాలజీ ఫిలింలో ఒక పార్ట్ డైరెక్ట్ చేసిన అల్ఫాన్సో.. ఫుల్ లెంగ్త్ సినిమా తీయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘గోల్డ్’. మలయాళం టాప్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రమిది.
గురువారమే ‘గోల్డ్’ థియేటర్లలోకి దిగింది. మార్నింగ్ షోల టాక్ చాలా బాగుంది. ఇది అల్ఫాన్సో మార్కు సినిమా అంటున్నారు. టీజర్ తరహాలోనే సినిమా కూడా క్రేజీ క్రేజీగా ఉందని.. వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని అంటున్నారు. ‘గోల్డ్’తో మళ్లీ అల్ఫాన్సో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయబోతున్నాడని అంటున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘గోల్డ్’ సినిమాను అల్ఫాన్సో రిలీజ్ ముంగిట అసలు ప్రమోట్ చేయలేదు. కనీసం ట్రైలర్ కూడా లాంచ్ చేయకపోవడం గమనార్హం. ఇక ప్రెస్ మీట్లు, ప్రి రిలీజ్ ఈవెంట్ల సంగతి సరేసరి. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక క్రేజీ టీజర్ మినహా ఏ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయలేదు. ఆ టీజర్ కూడా సినిమా గురించి పెద్దగా ఐడియా ఇచ్చిందేమీ లేదు. ఇక రిలీజ్ ముంగిట ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చాడు అల్ఫాన్సో. అందులో తన ‘నేరమ్’, ‘ప్రేమమ్’ చిత్రాల్లాగే ‘గోల్డ్’ కూడా పర్ఫెక్ట్ కాని సినిమా అని.. కానీ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా ఉంది.
This post was last modified on December 1, 2022 6:20 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…