హీరోయిన్ అంటే ఎప్పుడూ నాజూగ్గానే ఉండాలన్నది ఒక అప్రకటిత నిబంధన. సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితానికి పరిమితం అయినా సరే.. హీరోయిన్లు లావైతే అభిమానులు తట్టుకోలేరు. ఆ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి అని కామెంట్లు చేస్తారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో బాడీ షేమింగ్ కామెంట్లు మామూలుగా ఉండవు. ఇక సినిమాల్లో కొనసాగుతుండగా.. హీరోయిన్లు షేప్ అవుట్ అయ్యారంటే అంతే సంగతులు. విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాను చాన్నాళ్ల నుంచి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నానంటూ వాపోయింది మలయాళ హీరోయిన్ మాంజిమా మోహన్. గౌతమ్ మీనన్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జోడీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాంజిమా.. తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడైన గౌతమ్ కార్తీక్తో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉండడం.. ఇటీవలే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
పెళ్లి ఫొటోలు చూసినా మాంజిమా కొంచెం బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె బాడీ గురించి రకరకాల కామెంట్లు తప్పలేదు. ఐతే సోషల్ మీడియా సంగతి పక్కన పెడితే.. పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొందరు తన ఫిజిక్ గురించి కామెంట్లు చేసినట్లు మాంజిమా వెల్లడించడం గమనార్హం.
“నా శరీరాకృతి విషయంలో ఎప్పట్నుంచో విమర్శలు ఎదుర్కొంటున్నా. నిజం చెప్పాలంటే నా పెళ్లిలోనూ కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్లు చేశారు. మొదట్లో ఇలాంటి కామెంట్లు విని బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఫిట్గా, సంతోషంగానే ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపించినపుడు తప్పకుండా తగ్గుతా” అని మాంజిమా స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత కూడా అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని మాంజిమా తెలిపింది. ‘దేవరట్టం’ అనే సినిమాలో కలిసి నటించినపుడు స్నేహితులుగా మారిన గౌతమ్, మాంజిమా ఆ తర్వాత ప్రేమికులుగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు.
This post was last modified on December 1, 2022 2:22 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…