క్రమంగా రీ రిలీజులను అరిగిపోయిన ట్రెండ్ గా మారుస్తున్న పరిస్థితిలో పన్నీటి జల్లులా ఒక నిజమైన క్లాసిక్ మరోసారి థియేటర్లలో అడుగు పెట్టనుంది. టాలీవుడ్ స్క్రీన్ ప్లేకి భగవద్గీతలా భావించే మాయాబజార్ కలర్ వర్షన్ ని ఈ నెల 9న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. 2009లో దీన్ని రీ మాస్టర్ చేసి ఫోర్ కె రెజల్యూషన్ తో పునఃవిడుదల చేసినప్పుడు భారీ స్పందన వచ్చింది. కొంత భాగం కట్ చేయాల్సి వచ్చినా డిటిఎస్ సౌండ్ తో పూర్తి రంగుల్లో చూసిన నిన్న తరం ఇప్పటి జనరేషన్ పులకరించిపోయారు.
ఇప్పుడు మరోసారి దాన్ని ఆవిష్కరించబోతున్నారు. 1957లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక పునఃవిడుదల దక్కించుకున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు కానీ చాలా దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దీన్ని ప్రదర్శిస్తూనే ఉండేవారని పెద్దలు కథలుగా చెబుతారు. అసలు పాండవులను చూపించకుండా దర్శకులు కెవి రెడ్డి చేసిన మాయాజాలం, టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా ఛాయాగ్రాహకులు మార్కస్ బాట్లీ ప్రయోగం గురించి ఎన్ని పుస్తకాలు కథనాలు వచ్చాయో చెప్పడం కష్టం.
ఇలాంటి ఆణిముత్యాలు మరిన్ని రావాలి. ఈ మాయ బజారే కాదు జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి మరికొన్ని విజయ అద్భుతాలను కలర్ లో మార్చే ప్లానింగ్ ఉందని చెప్పారు కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. హిందీలోనూ ముఘల్ ఏ అజమ్, నయా దౌర్ తర్వాత ఈ ప్రక్రియ ఆపేశారు. పోనీ రంగులు మార్చకపోయినా ఒరిజినల్ వెర్షన్లను స్క్రీన్ చేసినా వీటి గొప్పదనాన్ని ఇప్పటి యువతకు పరిచయం చేసినట్టు అవుతుంది. అంతే తప్ప అయిదు పదేళ్ల క్రితం వచ్చిన యావరేజ్ సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లకు తీసుకొస్తే ఆడియన్స్ లో ఆసక్తి తగ్గక ఇంకేమవుతుంది
This post was last modified on December 1, 2022 11:59 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…