క్రమంగా రీ రిలీజులను అరిగిపోయిన ట్రెండ్ గా మారుస్తున్న పరిస్థితిలో పన్నీటి జల్లులా ఒక నిజమైన క్లాసిక్ మరోసారి థియేటర్లలో అడుగు పెట్టనుంది. టాలీవుడ్ స్క్రీన్ ప్లేకి భగవద్గీతలా భావించే మాయాబజార్ కలర్ వర్షన్ ని ఈ నెల 9న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. 2009లో దీన్ని రీ మాస్టర్ చేసి ఫోర్ కె రెజల్యూషన్ తో పునఃవిడుదల చేసినప్పుడు భారీ స్పందన వచ్చింది. కొంత భాగం కట్ చేయాల్సి వచ్చినా డిటిఎస్ సౌండ్ తో పూర్తి రంగుల్లో చూసిన నిన్న తరం ఇప్పటి జనరేషన్ పులకరించిపోయారు.
ఇప్పుడు మరోసారి దాన్ని ఆవిష్కరించబోతున్నారు. 1957లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక పునఃవిడుదల దక్కించుకున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు కానీ చాలా దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దీన్ని ప్రదర్శిస్తూనే ఉండేవారని పెద్దలు కథలుగా చెబుతారు. అసలు పాండవులను చూపించకుండా దర్శకులు కెవి రెడ్డి చేసిన మాయాజాలం, టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా ఛాయాగ్రాహకులు మార్కస్ బాట్లీ ప్రయోగం గురించి ఎన్ని పుస్తకాలు కథనాలు వచ్చాయో చెప్పడం కష్టం.
ఇలాంటి ఆణిముత్యాలు మరిన్ని రావాలి. ఈ మాయ బజారే కాదు జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి మరికొన్ని విజయ అద్భుతాలను కలర్ లో మార్చే ప్లానింగ్ ఉందని చెప్పారు కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. హిందీలోనూ ముఘల్ ఏ అజమ్, నయా దౌర్ తర్వాత ఈ ప్రక్రియ ఆపేశారు. పోనీ రంగులు మార్చకపోయినా ఒరిజినల్ వెర్షన్లను స్క్రీన్ చేసినా వీటి గొప్పదనాన్ని ఇప్పటి యువతకు పరిచయం చేసినట్టు అవుతుంది. అంతే తప్ప అయిదు పదేళ్ల క్రితం వచ్చిన యావరేజ్ సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లకు తీసుకొస్తే ఆడియన్స్ లో ఆసక్తి తగ్గక ఇంకేమవుతుంది
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…
‘రా ఎన్టీఆర్’ పేరుతో ఒక ఎన్జీవో చేపట్టబోతున్న ‘ఊరు వాడ’ కార్యక్రమం మీద ఇటీవల పెను దుమారం రేగిన సంగతి…