Movie News

సంవత్సరం పాటు రాసిన ఆ కథ ఏంటో!?

ఎప్పటినుండో అదిగో ఇదిగో అంటున్న శేఖర్ కమ్ముల డైరక్షన్లో ధనుష్‌ సినిమా మొత్తానికి చాలా లేటుగా ఇప్పుడు పూజకు నోచుకుంది. అయితే నాగ చైతన్యతో తీసిన ‘లవ్ స్టోరి’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో కమ్మలు కూడా కాస్త నిరాశచెందినట్లు తెలుస్తోందిలే. ఏదేమైనా కూడా ఇప్పుడు సంవత్సరంపాటు కష్టపడి అసలు హ్యాపీ డేస్ దర్శకుడు రాసిన కథ ఏంటో అంటూ టాలీవుడ్‌లో ఊహాగానాలు చాలానే వినిపిస్తున్నాయి.

నిజానికి శేఖర్ కమ్ముల గతంలో లీడర్ సినిమాకు ఒక సీక్వెల్ చేద్దామని అనుకున్నాడట. కాని అందుకు సురేష్‌ బాబు ఒప్పుకోలేదని అప్పట్లో టాక్. ఒక మంచి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఆ తరువాత అతి పెద్ద అవినీతిపరుడైతే ఎలా ఉంటుంది అనే కథతో కమ్ముల ముందుకొస్తే.. దానిని సురేష్ బాబు వద్దన్నారట. మరి ధనుష్‌‌తో ఇదే కథను తీస్తున్నాడేమో అనే సందేహం ఎప్పటినుండో ఉంది. కాని శేఖర్ మాత్రం.. అప్పట్లో ఒక ప్రీ-ఇండిపెండెన్స్ తాలూకు కథను ఒకటి రెడీ చేశాడు. మనకు స్వాతంత్ర్యం రాకముందు.. మద్రాసు ప్రావిడెన్స్‌లో ఆంధ్ర కలిసున్నప్పుడు.. అక్కడి తమిళబ్బాయ్‌కి, ఇక్కడి నుండి చదుకోవడానికి మద్రాసు వెళ్ళిన ఒక అమ్మాయికీ మధ్యన జరిగే ప్రేమకథగా ఒక స్టోరీ డెవలెప్ చేశాడు. ఇప్పుడు దానినే ధనుష్‌ హీరోగా మూడు బాషల్లో తీస్తున్నారని సన్నిహతులు చెబుతున్నారు.

ఏదేమైనా కూడా ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ధనుష్‌ సినిమాతో ప్యాన్ ఇండియా రేస్‌లో జాయిన్ అయిపోతాడులే. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ తెలుగుకే పరిమితం అయిపోయాయ్. కొన్ని సినిమాల్లో బాగా లోకల్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి, వాటిని వేరే రాష్ట్రాల్లో ఆడించడం కూడా కష్టం. అందుకే కమ్ముల కూడా ఇప్పుడు పీరియడ్ కథను ఎంచుకున్నాడని అనుకోవచ్చు. త్వరలోనే ఈ కథపై మరిన్ని ఇతర డిటైల్స్ వస్తాయేమో చూద్దాం మరి.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

1 hour ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

4 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

8 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

9 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

10 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

11 hours ago