ఒక దర్శకుడు ఒక కథను ఒక హీరోతో తీద్దామనుకుని ప్రయత్నం చేసి.. ఏవో కారణాలతో అక్కడ దుకాణం సర్దుకుని వేరే హీరో దగ్గరికి వెళ్లిపోవడం.. అదే కథను ఆ హీరోతో తెరకెక్కించడం టాలీవుడ్లో కొత్త కాదు. టాలీవుడ్లో ఇలాంటి సినిమాల లిస్టు తీస్తే చాలా పెద్దదే అవుతుంది. ఈ మధ్య ఇలాంటి చేతులు మారిన సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు అంగీకారం కుదిరాక.. ఏవో కారణాలతో వాటిని పక్కన పెట్టి వేరే హీరోలతో జట్టు కట్టిన దర్శకులు ముగ్గురు ఉండడం విశేషం. తారక్తోనే తన డైరెక్టోరియల్ డెబ్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత అతడి కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి అదే కథతో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ చేశాడు వక్కంతం వంశీ.
కానీ ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టి తారక్ ఈ సినిమా చేయకపోవడం మంచిదే అనుకునేలా చేసింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్తో ఒక సినిమాకు అంగీకారం కుదిరి, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక.. త్రివిక్రమ్ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఐతే తారక్ కోసం అనుకున్న కథ వేరు. మహేష్తో చేయబోయేది వేరని సమాచారం. ఇక తారక్తో సినిమా క్యాన్సిల్ అయిన మరో దర్శకుడు బుచ్చిబాబు సానా.
అతను తారక్ కోసం సిద్ధం చేసిన కథనే రామ్ చరణ్తో తీయబోతున్నాడు. ఇంతకుముందు బుచ్చిబాబు గురువు సుకుమార్.. మహేష్ కోసం అనుకున్న కథనే మార్చి బన్నీతో ‘పుష్ప’ తీశాడు. బన్నీ వచ్చాక కథ, పాత్రల రూపు రేఖలు మారిపోయాయి కానీ.. నేపథ్యం అయితే అదే. ‘పుష్ఫ’ బ్లాక్బస్టర్ అయి మహేష్ రిగ్రెట్ కావాల్సిన పరిస్థితి కల్పించింది. ఇప్పుడిక బుచ్చిబాబు వంతొచ్చింది. చరణ్తో అతను తీయబోయే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
మంచి అండర్స్టాండింగ్తోనే తారక్కు బై చెప్పి చరణ్తో జట్టు కడుతున్నాడు బుచ్చిబాబు. మరి తన గురువు లాగే అతను కూా పెద్ద హిట్ కొట్టి తారక్ అండ్ ఫ్యాన్స్ ఆ సినిమా చేయనందుకు రిగ్రెట్ అయ్యేలా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on November 29, 2022 6:26 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…