ఒక దర్శకుడు ఒక కథను ఒక హీరోతో తీద్దామనుకుని ప్రయత్నం చేసి.. ఏవో కారణాలతో అక్కడ దుకాణం సర్దుకుని వేరే హీరో దగ్గరికి వెళ్లిపోవడం.. అదే కథను ఆ హీరోతో తెరకెక్కించడం టాలీవుడ్లో కొత్త కాదు. టాలీవుడ్లో ఇలాంటి సినిమాల లిస్టు తీస్తే చాలా పెద్దదే అవుతుంది. ఈ మధ్య ఇలాంటి చేతులు మారిన సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు అంగీకారం కుదిరాక.. ఏవో కారణాలతో వాటిని పక్కన పెట్టి వేరే హీరోలతో జట్టు కట్టిన దర్శకులు ముగ్గురు ఉండడం విశేషం. తారక్తోనే తన డైరెక్టోరియల్ డెబ్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత అతడి కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి అదే కథతో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ చేశాడు వక్కంతం వంశీ.
కానీ ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టి తారక్ ఈ సినిమా చేయకపోవడం మంచిదే అనుకునేలా చేసింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్తో ఒక సినిమాకు అంగీకారం కుదిరి, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక.. త్రివిక్రమ్ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఐతే తారక్ కోసం అనుకున్న కథ వేరు. మహేష్తో చేయబోయేది వేరని సమాచారం. ఇక తారక్తో సినిమా క్యాన్సిల్ అయిన మరో దర్శకుడు బుచ్చిబాబు సానా.
అతను తారక్ కోసం సిద్ధం చేసిన కథనే రామ్ చరణ్తో తీయబోతున్నాడు. ఇంతకుముందు బుచ్చిబాబు గురువు సుకుమార్.. మహేష్ కోసం అనుకున్న కథనే మార్చి బన్నీతో ‘పుష్ప’ తీశాడు. బన్నీ వచ్చాక కథ, పాత్రల రూపు రేఖలు మారిపోయాయి కానీ.. నేపథ్యం అయితే అదే. ‘పుష్ఫ’ బ్లాక్బస్టర్ అయి మహేష్ రిగ్రెట్ కావాల్సిన పరిస్థితి కల్పించింది. ఇప్పుడిక బుచ్చిబాబు వంతొచ్చింది. చరణ్తో అతను తీయబోయే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
మంచి అండర్స్టాండింగ్తోనే తారక్కు బై చెప్పి చరణ్తో జట్టు కడుతున్నాడు బుచ్చిబాబు. మరి తన గురువు లాగే అతను కూా పెద్ద హిట్ కొట్టి తారక్ అండ్ ఫ్యాన్స్ ఆ సినిమా చేయనందుకు రిగ్రెట్ అయ్యేలా చేస్తాడేమో చూడాలి.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…