టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నడి వయసులో భార్యను కోల్పోవడం, తర్వాత రెండేళ్లకు రెండో పెళ్లి చేసుకోవడం.. తర్వాత ఓ బిడ్డను కూడా కనడం తెలిసిందే. దిల్ రాజు కూతురే ఆయన్ని రెండో పెళ్లికి ఒప్పించిందని.. దగ్గరుండి పెళ్లి చేయించిందని ఒక ప్రచారం నడిచింది అప్పట్లో. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు. దీనిపై ఆయన ఏమన్నారంటే..
‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు. నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. ఉన్నట్లుండి భార్యను కోల్పోవడంతో ఎమోషనల్గా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్తితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను. భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. అప్పుడు ఆప్షన్లు చూశాం. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించాం. వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో పరిచయం లేదు.
ఐతే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది’’ అని దిల్ రాజు వివరించాడు.
This post was last modified on November 29, 2022 3:02 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…