టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నడి వయసులో భార్యను కోల్పోవడం, తర్వాత రెండేళ్లకు రెండో పెళ్లి చేసుకోవడం.. తర్వాత ఓ బిడ్డను కూడా కనడం తెలిసిందే. దిల్ రాజు కూతురే ఆయన్ని రెండో పెళ్లికి ఒప్పించిందని.. దగ్గరుండి పెళ్లి చేయించిందని ఒక ప్రచారం నడిచింది అప్పట్లో. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు. దీనిపై ఆయన ఏమన్నారంటే..
‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు. నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. ఉన్నట్లుండి భార్యను కోల్పోవడంతో ఎమోషనల్గా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్తితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను. భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. అప్పుడు ఆప్షన్లు చూశాం. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించాం. వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో పరిచయం లేదు.
ఐతే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది’’ అని దిల్ రాజు వివరించాడు.
This post was last modified on November 29, 2022 3:02 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…