కొన్ని డిజాస్టర్ల గాయాలు అంత త్వరగా మాసిపోవు మర్చిపోనివ్వవు. అందులో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా గురించి కనీసం గుర్తు చేసుకునేందుకు కూడా అభిమానులు ఇష్టపడరు. అంత తీవ్రంగా నిరాశపరిచింది. ఆ మధ్య రామ్ చరణ్ ఒక ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన మూవీని ఎవరూ పట్టించుకోలేదని అంత వీక్ గా కంటెంట్ ఉందని అర్థమొచ్చేలా చెప్పడం వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో దాని తాలూకు సంగతులు బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మణిశర్మ వచ్చి చేరారు.
ఆచార్యలో కథా కథనాలు ఎంత బాలేనప్పటికీ సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అసలు మణిశర్మే కంపోజ్ చేశారానే డౌట్ కూడా వచ్చింది. ఈ విషయాన్నే అలీ తన టాక్ షోలో నేరుగా మణిశర్మనే అడిగేశారు. దానికాయన సమాధానం చెబుతూ రెండు పాటలు హిట్ అయిన సంగతి ఎవరూ మాట్లాడరని, అయినా మెగాస్టార్ సినిమాలకు పని చేస్తూ పెరిగిన తాను కావాలని బ్యాడ్ అవుట్ ఫుట్ ఎందుకు ఇస్తానని క్లారిటీ ఇచ్చారు. ముందు ఇచ్చిన బిజిఎం వేరే అయితే దర్శకుడు కొరటాల శివ ఇంకేదైనా కొత్త వెర్షన్ కావాలని కోరడంతో మార్చేశానని అన్నారు.
సో ఇది కూడా కొరటాల పొరపాటేననే స్పష్టత నేరుగా మణిశర్మ నుంచే వచ్చింది. స్వయంగా చెప్పారు కాబట్టి కొట్టిపారేయలేం. నిజానికి తనకు చిరుకు అద్భుతమైన ఆల్బమ్స్ గతంలో ఎన్నో ఉన్నాయి. ఇంద్ర, ఠాగూర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా ఇప్పటికీ కిక్ ఇచ్చే పాటలు. బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొట్టిన జై చిరంజీవా, మృగరాజు లాంటి వాటికి సైతం సూపర్ ట్యూన్స్ ఇచ్చిన దాఖలాలున్నాయి. ఒక్క ఆచార్యలో మాత్రం ఈ కాంబో లెక్క తప్పింది. మాములుగా ఇలాంటివి బయటికి ఎక్కువగా చెప్పని మణిశర్మ అలీ ముందు ఓపెన్ అవ్వడం గమనార్హం.
This post was last modified on November 29, 2022 10:11 am
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి…
మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…
ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా…
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…
లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై…