ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఒక దశ ఆ తర్వాత ఆ టాపిక్ పక్కన పెట్టేశారు అభిమానులు. బాహుబలి అయ్యాక.. సాహో పూర్తి చేశాక.. అంటూ ప్రభాస్ పెళ్లి గురించి అప్పట్లో సంకేతాలు అందాయి. కానీ ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుపోతున్నడు తప్ప పెళ్లి ఊసే ఎత్తట్లేదు.
ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డ కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. మరి పెదనాన్న కోరిక తీర్చడం కోసం ప్రభాస్ ఇప్పుడేమైనా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడేమో తెలియదు. కానీ ప్రభాస్తో ముడిపెట్టి ఒక హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా నానుతోంది.
ఆ పేరు కృతి సనన్ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ మధ్య అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్తో కృతి చాలా సన్నిహితంగా మెలగడం.. అతడికి చెమట పడుతుంటే చున్నీ ఇవ్వజూపడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్సించింది.
కానీ ఈ మాత్రానికే ప్రేమ అని ఒక అంచనాకు వచ్చేయలేం. కానీ ఇప్పుడు కృతిని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్య మాత్రం అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. వరుణ్, కృతి కలిసి ‘బేడియా’ (తెలుగులో తోడేలు) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ కార్యక్రమంలో ఈ ఇద్దరూ సందడి చేశారు.అందులో పక్కన కరణ్ జోహార్ను పెట్టుకుని ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు వరుణ్. కృతి మనసులో ఒక వ్యక్తి ఉన్నాడని.. ఆ వ్యక్తి ఇప్పుడు ముంబయిలో లేడని.. వేరే చోట దీపికా పదుకొనేతో కలిసి షూటింగ్ చేస్తున్నాడని అతను వ్యాఖ్యానించాడు.
ఈ కామెంట్ ప్రభాస్ను ఉద్దేశించే అన్నది స్పష్టం. ప్రస్తుతం ప్రభాస్.. ‘ప్రాజెక్ట్-కే’లో భాగంగా దీపికా పదుకొనేతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అతను ముంబయిలో ఉండేది తక్కువ. కాబట్టి వరుణ్ అన్నది ప్రభాస్ గురించే అనడంలో సందేహం లేదు. కానీ సినిమా ప్రమోషన్ కోసం తమాషాకు ఈ మాట అన్నాడా.. లేక నిజంగా ప్రభాస్-కృతి మధ్య సీరియస్గా వ్యవహారం నడుస్తోందా అన్నది చర్చనీయాంశం అవుతోంది.
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…