యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. కెరీర్లో ఒక దశలో వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొన్న నితిన్.. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాక కొంచెం జాగ్రత్తగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా మళ్లీ మంచి హిట్ కొట్టి ట్రాక్లో పడుతూ వచ్చాడు.
కానీ ‘భీష్మ’కు ముందు తర్వాత అతడికి చాలానే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆశలు పెట్టుకున్న ప్రతి సినిమా నిరాశ పరుస్తోంది. గత ఏడాది ‘చెక్’, ‘రంగ్ దె’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో అతను హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్నాడు.
అందులోనూ ‘మాచర్ల..’ అయితే నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇంకో ఫ్లాప్ పడితే తట్టుకునే స్థితిలో లేని నితిన్.. కొంచెం అలెర్ట్ అయినట్లే కనిపిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయకుండా.. అది పర్ఫెక్ట్ అనిపించే వరకు షూటింగ్ మొదలుపెట్టలేదు.
కొన్ని నెలల కసరత్తు తర్వాత స్క్రిప్టును లాక్ చేసి.. ఏ హడావుడి లేకుండా సైలెంటుగా మారేడుమిల్లిలో సూట్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఆదివారమే చిత్రీకరణ ఆరంభమైనట్లు సమాచారం. మారేడుమిల్లి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘పుష్ప’ సినిమా.
పేరుకు ఆ సినిమా నడిచేది చిత్తూరు-శేషాచలం అడవుల నేపథ్యంలో కానీ.. నిజానికి చిత్రీకరణ అంతా మారేడుమిల్లిలోనే చేశారు. ఇప్పుడు నితిన్, వక్కంతం కూడా అదే ప్రాంతాన్ని షూటింగ్ కోసం ఎంచుకున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇందులో నితిన్ కూడా స్మగ్లర్ పాత్రనే చేస్తున్నాడట.
‘పుష్ప’లో బన్నీ లాగే నితిన్ సైతం జుట్టు గడ్డం బాగా పెంచి డిపరెంట్ లుక్లోకి మారిన సంగతి తెలిసిందే. గడ్డం.. స్మగ్లర్.. మారేడుమిల్లి.. ఆ మాటలు వింటే అందరికీ ‘పుష్ప’ను అనుకరిస్తున్నారేమో అన్న సందేహాలు కలగడం ఖాయం. మరి పాత కథలను రీహ్యాష్ చేస్తాడని పేరున్న వక్కంతం.. నితిన్ కోసం ఏం రెడీ చేశాడో చూడాలి.
This post was last modified on November 28, 2022 1:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…