Movie News

అల్లరోడు తన జానర్లోకి వెళ్లాల్సిందే

అల్లరి నరేష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. టాలీవుడ్లో అసలేమాత్రం నెగెటివిటీ లేకుండా, అందరు స్టార్ హీరోల అభిమానులూ ఇష్టపడే కథానాయకుల్లో అతనొకడని చెప్పాలి. ప్రేక్షకులకు అతడి మీద అంత ప్రత్యేకమైన అభిమానం ఏర్పడడానికి కారణం.. అతను ఒక టైంలో తన సినిమాలతో తిరుగులేని వినోదాన్ని అందించడమే.

‘అల్లరి’ మొదలుకుని ‘సుడిగాడు’ వరకు అతను ప్రేక్షకులను మామూలుగా నవ్వించలేదు. విరామం లేకుండా కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులకు థియేటర్లలో మంచి రిలీఫ్ ఇచ్చాడు. ఐతే ‘సుడిగాడు’లో నరేష్ ఓవర్ డోస్ పేరడీ, స్పూఫ్ ఎంటర్టన్మెంట్ ఇచ్చేయడంతో ఆ తర్వాత అతను చేసిన కామెడీ సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. జానర్ మార్చినా ఫలితం లేకపోయింది. చివరికి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ‘నాంది’ అనే సీరియస్ మూవీ చేశాడు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చింది.

‘నాంది’ సినిమాలో కథ చాలా బలంగా ఉంటుంది. అందులో సర్ప్రైజింగ్‌ ఎలిమెంట్స్ ఉంటాయి. నరేష్ కామెడీ వదిలేసి సీరియస్ మూవీ చేయడం వల్లే అది బాగా ఆడిందనుకుంటే పొరబాటే. నరేష్ మాత్రం ఇలాగే ఫీలైనట్లున్నాడు. మళ్లీ అతను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రూపంలో మరో సీరియస్ మూవీ చేశాడు. ఈ రోజుల్లో సీరియస్ సినిమాలు అసలేమాత్రం వర్కవుట్ కావడం లేదు. ఎంటర్టైనర్లే కోరుకుంటున్నారు. అలా అని నరేష్ గతంలో చేసిన టైపులోనే కామెడీ సినిమాలు చేస్తే వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. కామెడీలోనూ ఇంకేదైనా కొత్తగా చెయ్యాలి.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో కొంచెం కామెడీ డోస్ ఉన్నా అది ఏమాత్రం సరిపోలేదు. ఇంత సీరియస్ మూవీ ఏం చూస్తాం అన్నట్లు తొలి రోజు థియేటర్ల వైపు ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. మార్నింగ్ షోల నుంచే డల్లుగా మొదలైన సినిమా.. మిక్స్డ్ రివ్యూల వల్ల పుంజుకోలేకపోయింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘుబాబు లాంటి వాళ్లు కొంచెం ఎంటర్టైన్ చేశారు కానీ.. నరేష్ అయితే మరీ సీరియస్‌గా కనిపించాడు. ఎంత ‘నాంది’ ఆడితే మాత్రం నరేష్ మరీ ఇంత సీరియస్ క్యారెక్టర్లు, సినిమాలు చేయాలా అని అతడి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కామెడీలోనే కొంచెం కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తే అల్లరోడు మంచి ఫలితాన్ని అందుకోగలడని వారు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 26, 2022 3:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago