న్యాచురల్ స్టార్ నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా డెబ్యూ చేసిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ అరుదైపోతూ వాళ్ళ నుంచి ఏడాదికి ఒకటో రెండో సినిమాలు వస్తున్న టైంలో నాని తన సిస్టర్ ని ఈ రకంగా ప్రోత్సహించడం మంచి పరిణామం. స్వయానా నిర్మాణ బాధ్యతలు తీసుకుని ప్రమోషన్లు గట్రా తనే దగ్గరుండి చేయించాడు. సత్యరాజ్, రోహిణి లాంటి సీనియర్ క్యాస్టింగ్ తో పాటు, రుహానీ శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ ;తదితరుల యంగ్ జెనరేషన్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయిదు కథలను తీసుకుని అరగంటకు అటుఇటుగా హ్యూమన్ ఎమోషన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక సిరీస్ లో చూస్తే మొదటిది మీట్ ది బాయ్. పెళ్లి చూపుల కోసం బయట కలుసుకున్న ఓ అమ్మాయి అబ్బాయి మధ్య సంభాషణగా సాగుతుంది. ఇందులో చిన్న సర్ప్రైజ్ పెట్టారు. రెండోది ఓల్డ్ ఈజ్ గోల్డ్. విదేశీ ట్రిప్ కు వెళ్లాలనుకున్న భార్యను వద్దని చెప్పలేని భర్త సంఘర్షణకు పరిష్కారం ఒక వృద్ధుడి ద్వారా చెప్పించడం. మూడోది ఇన్ లా. కొడుకు ప్రేమించిన యువతి గురించి ఆరా తీయడానికి అతని తల్లే రంగంలో దిగి ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకోవడం. నాలుగోది స్టార్స్ టాక్. రాత్రిపూట కారు చెడిపోయిన ఓ హీరోయిన్ కు ఆమె ఎవరో తెలియని డాక్టర్ లిఫ్ట్ ఇచ్చాక జరిగే సంఘటన.
అయిదోది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. పెళ్లయ్యాక మొగుడంటే ఇష్టం కలగని ఓ భార్యకు బయటి నుంచి వచ్చిన అమ్మాయి కనువిప్పు కలిగించడం. మానవ సంబంధాలను నేపథ్యంగా తీసుకున్న దీప్తి ఈ మీట్ క్యూట్ ని పూర్తిగా అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీశారు. అయితే టేకింగ్ నెమ్మదిగా సాగడం, సుదీర్ఘమైన సంభాషణలు ఉండటం తక్కువ నిడివి ఉన్న కొన్ని ఎపిసోడ్స్ ని ల్యాగ్ ఫీలింగ్ వచ్చేలా చేశాయి. టెక్నికల్ టీమ్ పనితనం బాగుంది. ఎంత ఓటిటి కోసమైనా సరే మెసేజ్ పేరుతోనో భావోద్వేగాల పేరుతోనో సాగదీయాల్సిన అవసరం లేదు. కాస్త గట్టి ఓపిక చేసుకుంటేనే ఈ మీట్ క్యూట్ కి కనెక్ట్ అవ్వొచ్చు.
This post was last modified on November 25, 2022 10:12 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…