సినిమా రిలీజయ్యే వరకే ప్రమోషన్లు చేయడం గొప్పనుకుంటున్న టైంలో విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా ఎక్కడో జపాన్ దేశానికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్న రాజమౌళి టీమ్ దానికి తగ్గ ఫలితాన్నే అందుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ఎంత ప్లస్ అయ్యిందో కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. హై ఎమోషనల్ అండ్ యాక్షన్ కంటెంట్ ఉన్నవాటిని మాత్రమే ఎక్కువగా ఆదరించే జపాన్ లో రామరాజు భీంల కథ ఏ మేరకు కనెక్ట్ అవుతుందోననే అనుమానాలు బద్దలు కొడుతూ ఎట్టకేలకు ఆ దిశగా పరుగులు పెడుతోంది
ఇప్పటిదాకా ఆ దేశంలో విడుదలైన ఇండియన్ సినిమాల్లో అత్యంత వేగంగా 300 మిలియన్ యెన్లను దాటేసిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డు సృష్టించింది. అది కూడా కేవలం ముప్పై అయిదు రోజుల లోపే. థియేటర్లో నమోదు చేసుకున్న ఫుట్ ఫాల్స్ అక్షరాలా 2 లక్షల 3 వేల 867. అంటే ఇంత మంది జక్కన్న మాయాజాలాన్ని చూసేందుకు టికెట్లు కొన్నారు. ఇదింకా కొనసాగుతోంది. పైరసీ జాడే ఉండని జపాన్ లో పాజిటివ్ టాక్ వచ్చిన మూవీస్ కి చాలా లాంగ్ రన్ ఉంటుంది. బాహుబలి 2 సుదీర్ఘ కాలం ఆడింది. ఇప్పుడు ఎంత లేదన్నా ఆర్ఆర్ఆర్ ఇంకో నెల రోజులు కొనసాగడం ఖాయం.
టాప్ వన్ పొజిషన్ లో ఉన్న రజినీకాంత్ ముత్తుని దాటేందుకు ఆర్ఆర్ఆర్ కావాల్సింది కేవలం 100 మిలియన్ యెన్లు. ఆల్రెడీ ముప్పాతిక టార్గెట్ పూర్తయ్యింది కానీ ఇదేమంత కష్టం కాదు. అసలే ఆస్కార్ కోసం దేశ విదేశాలు తిరుగుతున్న రాజమౌళి కేవలం ఆ క్యాంపైన్ కోసమే యాభై కోట్లు ఖర్చు చేశారన్న టాక్ బలంగా ఉంది. అది నిజమో కాదో ఆయన చెప్పరు కానీ బాగా కష్టపడుతున్న మాట వాస్తవం. గత కొన్నేళ్లలో ఒక బ్లాక్ బస్టర్ గురించి ఎనిమిది నెలల తర్వాత కూడా డిస్కషన్ జరుగుతోందంటే చిన్న విషయం కాదు. నిజంగా ఆస్కార్ కల వేరవేరితే ఆ సంబరాలకు ఆకాశమే హద్దు.
This post was last modified on November 25, 2022 4:54 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…