దిల్ రాజు ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలతోనే మీడియాకు ఎక్కుతున్నాడు. జులైలో తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ-2’ చిత్రాన్ని వాయిదా వేయించాడంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూలో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది.
ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి రాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్న విషయంలో రాజు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది.
ఐతే ఇన్ని రోజులు ఈ విషయమై మౌనం వహించిన రాజు.. తాజాగా ‘మసూద’ అనే చిన్న సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ స్పందించాడు. త్వరలోనే ‘వారసుడు’ థియేటర్ల ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు రాజు వెల్లడించాడు. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగాఅర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఎవరికీ తెలియదని రాజు అన్నాడు. “దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని నా మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ నాలో ఇంకో సైడ్ కూడా ఉంది అని ఎవరికీ తెలియదు. సినిమాను ప్రేమించి మంచి కంటెంట్తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఒక అద్భుతమైన సినిమాను మన వాళ్లకు చూపిద్దామని తమిళ చిత్రం ‘లవ్ టుడే’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్తో రిలీజ్ చేస్తున్నా. డబ్బులు వద్దు నాకు. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఇక వారిసు సినిమా విషయానికి వస్తే థియేటర్ల ఇష్యూ గురించి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరుగుతోందో వివరిస్తా” అని రాజు తెలిపాడు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…