దిల్ రాజు ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలతోనే మీడియాకు ఎక్కుతున్నాడు. జులైలో తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ-2’ చిత్రాన్ని వాయిదా వేయించాడంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూలో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది.
ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి రాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్న విషయంలో రాజు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది.
ఐతే ఇన్ని రోజులు ఈ విషయమై మౌనం వహించిన రాజు.. తాజాగా ‘మసూద’ అనే చిన్న సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ స్పందించాడు. త్వరలోనే ‘వారసుడు’ థియేటర్ల ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు రాజు వెల్లడించాడు. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగాఅర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఎవరికీ తెలియదని రాజు అన్నాడు. “దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని నా మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ నాలో ఇంకో సైడ్ కూడా ఉంది అని ఎవరికీ తెలియదు. సినిమాను ప్రేమించి మంచి కంటెంట్తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఒక అద్భుతమైన సినిమాను మన వాళ్లకు చూపిద్దామని తమిళ చిత్రం ‘లవ్ టుడే’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్తో రిలీజ్ చేస్తున్నా. డబ్బులు వద్దు నాకు. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఇక వారిసు సినిమా విషయానికి వస్తే థియేటర్ల ఇష్యూ గురించి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరుగుతోందో వివరిస్తా” అని రాజు తెలిపాడు.
This post was last modified on November 24, 2022 1:58 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…