దిల్ రాజు ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలతోనే మీడియాకు ఎక్కుతున్నాడు. జులైలో తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ-2’ చిత్రాన్ని వాయిదా వేయించాడంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూలో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది.
ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి రాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్న విషయంలో రాజు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది.
ఐతే ఇన్ని రోజులు ఈ విషయమై మౌనం వహించిన రాజు.. తాజాగా ‘మసూద’ అనే చిన్న సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ స్పందించాడు. త్వరలోనే ‘వారసుడు’ థియేటర్ల ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు రాజు వెల్లడించాడు. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగాఅర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఎవరికీ తెలియదని రాజు అన్నాడు. “దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని నా మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ నాలో ఇంకో సైడ్ కూడా ఉంది అని ఎవరికీ తెలియదు. సినిమాను ప్రేమించి మంచి కంటెంట్తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఒక అద్భుతమైన సినిమాను మన వాళ్లకు చూపిద్దామని తమిళ చిత్రం ‘లవ్ టుడే’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్తో రిలీజ్ చేస్తున్నా. డబ్బులు వద్దు నాకు. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఇక వారిసు సినిమా విషయానికి వస్తే థియేటర్ల ఇష్యూ గురించి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరుగుతోందో వివరిస్తా” అని రాజు తెలిపాడు.
This post was last modified on November 24, 2022 1:58 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…