మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ యువ కథానాయకుడైనా చిరంజీవి అండదండలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు. ఆయన పర్యవేక్షణలోనే సినిమాలు చేస్తాడు. ముఖ్యంగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మీద చిరు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని అంటారు. మధ్యలో వరుస డిజాస్టర్లతో తేజ్ కెరీర్ గాడి తప్పిన నేపథ్యంలో ఈ మధ్య ఆయన అతడి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఆయన ఆమోద ముద్ర పడకుండా ఏ కథా పట్టాలెక్కడం లేదు. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో పాటు దేవా కట్టా దర్శకత్వంలో తేజు మొదలు పెట్టిన కొత్త సినిమా కథ కూడా చిరు విని ఓకే చేసినవే అని సమాచారం.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తేజు కోసం చిరు మరో కథ విని పచ్చ జెండా ఊపారట. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టలో ఒకటైన ఠాగూర్ సినిమాను నిర్మించిన ఠాగూర్ మధు.. తేజుతో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. గోపాల్ అనే కొత్త దర్శకుడు పట్టుకొచ్చిన భగవద్గీత సాక్షిగా అనే కథతో తేజు సినిమా చేయబోతున్నాడట. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ కథకు ముందు తేజు ఓకే చెప్పగా.. తర్వాత అది చిరు దగ్గరికి వెళ్లింది. ఆయన విని ట్రాజిక్ ఎండ్ కాకుండా కథను సుఖాంతం చేయాలని చెప్పగా.. ఆ మేరకు మార్పు చేశారట. ఇది తక్కువ బడ్జెట్లో పరిమిత కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కాల్సిన సినిమా అని.. భారీతనం ఉన్న దేవా సినిమాను ఇప్పుడిప్పుడే చిత్రీకరించడం కష్టం కాబట్టి ముందు ఈ సినిమాను తేజు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.
This post was last modified on July 15, 2020 2:45 am
అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…