మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ యువ కథానాయకుడైనా చిరంజీవి అండదండలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు. ఆయన పర్యవేక్షణలోనే సినిమాలు చేస్తాడు. ముఖ్యంగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మీద చిరు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని అంటారు. మధ్యలో వరుస డిజాస్టర్లతో తేజ్ కెరీర్ గాడి తప్పిన నేపథ్యంలో ఈ మధ్య ఆయన అతడి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఆయన ఆమోద ముద్ర పడకుండా ఏ కథా పట్టాలెక్కడం లేదు. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో పాటు దేవా కట్టా దర్శకత్వంలో తేజు మొదలు పెట్టిన కొత్త సినిమా కథ కూడా చిరు విని ఓకే చేసినవే అని సమాచారం.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తేజు కోసం చిరు మరో కథ విని పచ్చ జెండా ఊపారట. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టలో ఒకటైన ఠాగూర్ సినిమాను నిర్మించిన ఠాగూర్ మధు.. తేజుతో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. గోపాల్ అనే కొత్త దర్శకుడు పట్టుకొచ్చిన భగవద్గీత సాక్షిగా అనే కథతో తేజు సినిమా చేయబోతున్నాడట. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ కథకు ముందు తేజు ఓకే చెప్పగా.. తర్వాత అది చిరు దగ్గరికి వెళ్లింది. ఆయన విని ట్రాజిక్ ఎండ్ కాకుండా కథను సుఖాంతం చేయాలని చెప్పగా.. ఆ మేరకు మార్పు చేశారట. ఇది తక్కువ బడ్జెట్లో పరిమిత కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కాల్సిన సినిమా అని.. భారీతనం ఉన్న దేవా సినిమాను ఇప్పుడిప్పుడే చిత్రీకరించడం కష్టం కాబట్టి ముందు ఈ సినిమాను తేజు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.
This post was last modified on July 15, 2020 2:45 am
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…