సాధారణంగా స్టార్ హీరోలు థియేటర్స్ , కలెక్షన్స్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆ భాద్యతంతా నిర్మాత మీదే పెట్టేస్తుంటారు. అందులోకి సీనియర్ హీరోలయితే పొరపాటున కూడా నిర్మాత కి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరు. దీనికి చాలా లెక్కలుంటాయి. ఏదో ఒక ఏరియా మేరకు తీసుకోవడం వరకే ఇన్వాల్వ్ అవుతారు తప్ప అన్నింటిలో తలదూర్చరు.
ప్రస్తుతం చిరు , బాలయ్య కూడా అదే చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. వీటితో పాటే అజిత్ సినిమా అలాగే విజయ్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమాకి తెలుగులో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారని, మంచి థియేటర్స్ ఈ డబ్బింగ్ సినిమా కోసం ముందే బుక్ చేసేశారని ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు ని ఇరు వర్గాల అభిమానులు తప్పుబడుతున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా విషయం చిరు , బాలయ్య వరకూ వెళ్ళడం లేదా ? అనే ప్రశ్న ఫ్యాన్స్ మనసులో మెదులుతుంది. సంక్రాంతి పోటీ లో నిలవడమే కాదు సినిమా రిలీజ్ లు , థియేటర్స్ విషయాలు కూడా చూసుకోవాలని వారు భావిస్తున్నారు. కానీ వీటికి చిరు -బాలయ్య ఇద్దరూ వ్యతిరేకమే. అవును ఇద్దరూ తమ సినిమాల రిలీజ్ విషయాన్ని పూర్తిగా మైత్రి నిర్మాతలకే అప్పగించారు. థియేటర్స్ విషయంలో కానీ డబ్బింగ్ గొడవల్లో కానీ చిరు- బాలయ్య లు ఇన్వాల్వ్ అయ్యే సమస్యే లేదనిపిస్తుంది. ఫైనల్ గా చిన్నా చితక నిర్మాతలు ఏమైనా పబ్లిసిటీ కోసం రాద్దాంతం చేసి మీడియాకి ఎక్కాలే కానీ ఇండస్ట్రీలో కూడా డబ్బింగ్ లొల్లి ని ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు.
This post was last modified on November 22, 2022 10:17 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
వైసీపీ అధినేత జగన్కు జనసేన పార్టీముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. కీలక సూచనలు చేశారు. అయితే.. జగన్ ఎవరి మాటా…
మంత్రి లోకేష్ చెప్పిన మాటలను ఎమ్మెల్యేలు తు.చ. తప్పకుండా చేస్తున్నారనడానికి శనివారం రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలే ఉదాహరణ. వాస్తవానికి…
గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…
బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు…