ఇప్పటిదాకా హాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్లో మంచి వసూళ్లు సాధించడం, మన సినిమాలకు పోటీ ఇవ్వడమే చూశాం. కానీ త్వరలో ఓ హాలీవుడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను సునామీలా ముంచెత్తడం.. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పడం.. ఆ సినిమా చూడడం కోసం మన ప్రేక్షకులు తహతహలాడిపోవడం.. టికెట్లు దొరక్క అల్లాడిపోవడం చూడబోతున్నాం. ఈ ఉపోద్ఘాతం ‘అవతార్-2’ గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది.
ఇప్పటిదాకా ఇండియాలో హాలీవుడ్ సినిమాల హవా అనగానే అందరికీ ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’యే గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాల స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయించింది. డిసెంబరు 16న రాబోతున్న ‘అవతార్-2’కు సంబంధించి హంగామా ఇంకో లెవెల్లో ఉండబోతోందన్నది స్పష్టం. 2009లో ‘అవతార్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.
అలాంటి సినిమాకు సీక్వెల్ కావడం, దీని ట్రైలర్లు ఒక రేంజిలో ఉండడంతో ‘అవతార్-2’కు హైప్ మామూలుగా లేదు. దీనికి పోటీగా ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేసే సాహసం చేయడం లేదు. డిసెంబరు 16 నుంచి వారం రోజుల పాటు ఇండియన్ బాక్సాఫీస్ను ‘అవతార్-2’కే రాసిచ్చేయబోతున్నారు.
మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా మెజారిటీ థియేటర్లలో ఈ సినిమానే ఆడబోతోంది. ఈ సినిమాకు నెలకొనబోయే డిమాండ్ ఎలా ఉంటుందో అంచనా వేసి ఇండియాలో పలు సిటీల్లో ముందు రోజు అర్ధరాత్రి నుంచే ‘అవతార్-2’ స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారట. కొన్ని నగరాల్లో 24 గంటల పాటు సినిమా ప్రదర్శనకు అనుమతులు తీసుకుంటున్నారట. తొలి వీకెండ్లో విరామం లేకుండా షోలు ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. ఇలా ఓ హాలీవుడ్ సినిమాలకు మిడ్ నైట్, తెల్లవారుజామున షోలు పడడం ఇండియాలో ఇప్పటిదాకా జరగలేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. ‘అవతార్-2’ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 22, 2022 10:06 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…