కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ చాలా వరకు రీమేక్ సినిమాలతోనే సాగిపోతోంది. సొంత కథలు కరువైపోయి.. దక్షిణాది నుంచి హిట్టయిన సినిమాలను తీసుకుని కొంచెం మార్చి తమ ప్రేక్షకులకు అందిస్తోంది. ఐతే ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలూ సబ్టైటిల్స్తో స్ట్రీమ్ అవుతుండడం.. కొన్ని చిత్రాలకు హిందీ ఆడియోలు కూడా అందుబాటులో ఉండడంతో.. మంచి టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమానూ చూసేస్తున్నారు అక్కడి జనాలు. అవి చాలవన్నట్లు సౌత్ హిట్ సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు.
దీంతో రీమేక్ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఉన్నదున్నట్లుగా తీసినా, మార్పులు చేర్పులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ ఏడాది బచ్చన్ పాండే, జెర్సీ, హిట్, విక్రమ్ వేద లాంటి రీమేక్ సినిమాలు హిందీలో రిలీజయ్యాయి. అవన్నీ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఈ సినిమాలేవీ నిలవకపోవడంతో బాలీవుడ్ జనాలకు కంగారు మొదలైంది.
ఇక రీమేక్ సినిమాలు కట్టి పెడితే తప్ప ఇండస్ట్రీ బాగుపడదనే అభిప్రాయాలు బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఇదే అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఇప్పుడు ‘దృశ్యం-2’ వచ్చింది. ఇది మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన సీక్వెల్ మూవీకి రీమేక్. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఆ సినిమాలను హిందీ జనాలు ఏమేర చూశారో తెలియదు కానీ.. హిందీ ‘దృశ్యం-2’ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకైతే ఎగబడిపోతున్నారు. ఈ సినిమా వీకెండ్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్కు దక్కిన విజయమిది. ఈ సినిమా ఊపు చూస్తే మలయాళంలో జీతు జోసెఫ్-మోహన్ లాల్ కలిసి ‘దృశ్యం-3’ తీయడం ఆలస్యం మళ్లీ రీమేక్ చేసేలా ఉన్నారు. ఈ పరిణామం రీమేక్ల విషయంలో బాలీవుడ్ను గందరగోళానికి గురి చేస్తోందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 22, 2022 7:37 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…