సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి రెండు భారీ చిత్రాలు పోటీలో ఉండగా.. వాటికి దీటుగా తాను నిర్మిస్తున్న తమిళ చిత్రానికి అనువాదమైన ‘వారసుడు’కు దిల్ రాజు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు బుక్ చేస్తుండడంపై కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయమై నిర్మాతల మండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, పండుగలప్పుడు తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఉంటుందంటూ గతంలో రాజు ఇచ్చిన స్టేట్మెంట్ను ఉటంకిస్తూ ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ వివాదం, నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్పై అగ్ర నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికర రీతిలో స్పందించారు. నిర్మాతల మండలి స్టేట్మెంట్ను ఆయన ఖండించారు. దిల్ రాజుకు మద్దతుగా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
“నిర్మాతల మండలి ఇచ్చిన స్టేట్మెంట్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. వారి ప్రకటనను నేను ఖండిస్తున్నా. మన సినిమాలకు మన దగ్గర ఎలా ఆడుతున్నా సరే. చాలా వరకు డబ్బింగ్ మార్కెట్, ఓటీటీల వల్లే గట్టెక్కుతున్నాయి. తమిళంలో మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారు? ఇది ఆత్మహత్యా సదృశ్యమే. ఒక తెలుగు నిర్మాత, ఒక తెలుగు దర్శకుడు కలిసి సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసుకుంటే తప్పేముంది? ఇదే సంక్రాంతికి మరో నిర్మాత తమ ప్రొడక్షన్లో తెరకెక్కిన రెండు చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేసుకోవచ్చా? థియేటర్ల సమస్య ఎదురవుతోందంటే ఆ నిర్మాత తన సినిమాల్లో ఒకదాన్ని ఆపుకోవచ్చు కదా?” అని అశ్వినీదత్ ప్రశ్నించారు.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రెండూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూనే ఒకే నిర్మాత తన సినిమాలు రెంటిని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నపుడు.. దిల్ రాజు ‘వారసుడు’ను పండక్కి విడుదల చేయడంలో తప్పేముందని లా పాయింట్ తీశారు దత్.
This post was last modified on November 22, 2022 8:49 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…