ప్రశాంత్ వర్మ.. ఈ రోజు టాలీవుడ్లో ఇతనే హాట్ టాపిక్. ‘అ!’ అనే ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్.. ఆ తర్వాత ‘జాంబీరెడ్డి’ అనే జాంబీ మూవీ తీశాడు. ఈ సినిమాలను సూపర్ అనలేం. అలా అని తీసిపడేయలేం. ప్రశాంత్ అయితే డిఫరెంటుగా ఏదో చేయడానికి ప్రయత్నించాడు. ఆ చిత్రాలతో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నాడు. వీటి తర్వాత అతను ‘హనుమాన్’ అనే అడ్వెంచరస్ సూపర్ హీరో మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తేజ సజ్జా లాంటి అప్కమింగ్ హీరోను పెట్టి పెద్ద బడ్జెట్లో, పాన్ ఇండియా లెవెల్లో సినిమా అనౌన్స్ చేసేసరికి ప్రశాంత్ మరీ అతి చేస్తున్నాడనిపించింది అందరికీ. కానీ ఈ రోజు లాంచ్ అయిన టీజర్ చూశాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. 500 కోట్లు పెట్టి తీసిన ‘ఆదిపురుష్’ టీజర్ ఏ స్థాయిలో ట్రోల్స్కు గురైందో తెలిసిందే. కానీ అందులో పదో వంతు బడ్జెట్ కూడా లేని ‘హనుమాన్’లో విజువల్స్, గ్రాఫిక్స్ చూసి అందరూ షాకవుతున్నారు.
ప్రశాంత్ మామూలోడు కాదని, ‘హనుమాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేుట్ చేసేలా ఉన్నాడని చర్చించుకుంటున్నారు. సూపర్ హీరోల సినిమాలంటే ఎప్పుడూ హాలీవుడ్ వైపే చూస్తుంటాం. కానీ హనుమంతుడి రూపంలో మనకు ఇంకా పెద్ద సూపర్ హీరో ఉన్నాడనే విషయాన్ని అతను గుర్తించి భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. టీజర్లో చూపించిన తరహలోనే సినిమా ఉండి, అంచనాలను అందుకుంటే తెలుగులోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ‘హనుమాన్’ సంచలనం రేపడం ఖాయం.
ప్రశాంత్ ఈ సూపర్ హీరో సిరీస్లో ఇంకో రెండు సినిమాలు కూడా తీయబోతున్నాడట. తర్వాతి చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. దాని తర్వాత ఒక లేడీ ఓరియెంటెడ్ సూపర్ ఉమన్ సినిమా తీస్తాడట. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ అంటూ పోస్టర్ల మీద వేస్తున్నాడు. ‘హనుమాన్’ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…