ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మరణంతో లక్షల మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టాలీవుడ్లోనూ విషాదం అలుముకుంది. వివాద రహితుడిగా పేరున్న కృష్ణకు సంబంధించి అంత్యక్రియల విషయంలో చిన్న వివాదం నడిచింది.
కృష్ణ కుటుంబాలకు హైదరాబాద్ నగర శివార్లో పెద్ద ఎత్తున పొలాలు, ఫామ్ హౌస్ ఉండగా.. అక్కడ కాకుండా అందరికీ అంత్యక్రియలు చేసే మహాప్రస్థానంను ఎంచుకోవడంపై కొంత విమర్శలు ఎదురయ్యాయి. సొంత స్థలంలో అంత్యక్రియలు చేసి, సమాధి నిర్మించి మెమోరియల్ ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కృష్ణ కుటుంబీకుల్లో ఏకాభిప్రాయం లేదని.. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు అభీష్టానికి భిన్నంగా మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేశారని కొందరు ఊహాగానాలు పుట్టించారు. ఐతే ఈ విషయమై స్వయంగా ఆదిశేషగిరి రావు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
‘‘మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూర్చుని అంత్యక్రియల విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఇందులో వివాదానికి తావు లేదు. మొదట మహేశ్వరంలోని పద్మాలయా స్టూడియోలో అంత్యక్రియలు చేయాలనుకున్నాం. కానీ దూరం అవుతుందని వెనక్కి తగ్గాం. మా ఫాం హౌస్లో చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. జనం ఎవ్వరినీ రానివ్వకుండా ఎక్కడో దూరంగా అనాథలా చేయడం మాకు ఇష్టం లేదు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపినా మెమోరియల్ ఏర్పటు చేసి సమాధి కడతాం. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. కృష్ణగారు చనిపోయిన రోజు అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలీ స్టేడియంలో పార్థిక దేహాన్ని ఉంచాలని అనుకున్నాం. కానీ విపరీతంగా మంచు పడుతుండడంతో అందరికీ ఇబ్బంది అవుతుందని మా పద్మాలయా ఆఫీసులోనే ఉంచాం’’ అని ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ ఉన్న ఇంటిని మెమోరియల్గా మారుస్తారా అని అడిగితే.. ‘‘అన్నయ్య ఉన్నంత వరకు ఆయనదే ఆ ఇల్లు. ఆయన తదనంతరం అది నరేష్కు చెందుతుంది. మెమోరియల్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయనన్నారు.
This post was last modified on November 20, 2022 2:02 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…