లైగర్ సినిమా రిలీజై మూడు నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా గురించి చర్చలు, వివాదాలు మాత్రం ఇంకా ఆగట్లేదు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. సినిమా గురించి విజయ్, పూరి ఇచ్చిన బిల్డప్కి, తెర మీద చూసిందానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో రిలీజ్ టైంలో దాని మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంతా మూవ్ ఆన్ అయినట్లే కనిపించారు. బయ్యర్లకు కూడా నష్టపరిహారం సెటిల్ చేయడానికి పూరి ముందుకు రావడంతో ఆ సినిమా వ్యవహారం ముగిసిన కథగా భావించారు.
కానీ కొన్ని వారాల కిందట బయ్యర్లు.. పూరి ఆఫీస్ ముందు ఆందోళనకు సిద్ధం కావడం.. ఈ విషయం తెలుసుకున్న పూరి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఫోన్ కాల్ లీక్ అవడం.. ఆ తర్వాత ఆయన బయ్యర్లు, ఫైనాన్షియర్ల మీద ఫిర్యాదు చేయడం.. వాళ్లు పూరి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం తెలిసిందే.
ఆ తర్వాత ఆ వివాదం ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ దృష్టి ‘లైగర్’ టీం మీద పడిందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారనే అనుమానం రావడంతోనే ఈడీ ఫోకస్ పెట్టిందట. ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన పూరి జగన్నాథ్, ఆయన నిర్మాణ భాగస్వామి ఛార్మి కౌర్లను పిలిచి విచారిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ‘లైగర్’ టీం అతిక్రమించిందని.. పెట్టుబడుల విషయంలో చాలా అనుమానాలున్నాయని, అందుకే ఈడీ అధికారులు ఈ చిత్ర నిర్మాతలైన పూరి, ఛార్మిలను విచారిస్తున్నారని అంటున్నారు. మరి రాజకీయ నేతలు సినిమాలో బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలే నిజం అయితే బయ్యర్లకు సెటిల్మెంట్ విషయంలో అంత గొడవ జరగడం ఆశ్చర్యకరం. మరి ఈ విచారణలో ఈడీ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.
This post was last modified on November 17, 2022 10:36 pm
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…