తెలుగు సినిమాలకు కొత్తగా మార్కెట్ ఏర్పడుతున్న దేశం జపాన్. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కొన్ని అక్కడ బాగా ఆడాయి. ఇక మన సినిమాలకు పెద్ద మార్కెట్ క్రియేట్ చేసిన సినిమా అంటే ‘బాహుబలి’నే. ఆ సినిమా అక్కడ సంచలన వసూళ్లు రాబట్టింది. జపాన్లో రజినీ సినిమా ‘ముత్తు’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘బాహుబలి’ రికార్డు నెలకొల్పింది.
ఆ చిత్రం ఫుల్ రన్లో 360 మిలియన్ యాన్లు కలెక్ట్ చేసింది. ఐతే ‘ముత్తు’ సినిమా 90ల్లోనే 400 మిలియన్ యాన్లతో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఏ చిత్రమూ అధిగమించలేదు. ఐతే రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఆ రికార్డు మీద కన్నేసినట్లే కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి జపాన్లో గట్టిగా ప్రమోట్ చేశారు. వేరే రకమైన పబ్లిసిటీ కూడా గట్టిగా జరిగింది. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
విడుదలైన తొలి వారంలోనే 75 మిలియన్ యాన్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచింది ‘ఆర్ఆర్ఆర్’. తర్వాతి మూడు వారాల్లోనూ సినిమా జోరేమీ తగ్గలేదు నాలుగు వారాలు ముగిసేసరికి ‘ఆర్ఆర్ఆర్’ 250 మిలియన్ యాన్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ‘బాహుబలి’ సినిమా 250 మిలియన్ యాన్ల మార్కును అందుకోవడానికి 36 వారాలు పట్టడం గమనార్హం.
అంతటి వసూళ్లను ‘ఆర్ఆర్ఆర్’ నాలుగు వారాల్లోనే అందుకుందంటే ఈ సినిమా జపాన్లో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోందో అర్తం చేసుకోవచ్చు. జపాన్లో మన లాగా సినిమాల థియేట్రికల్ రన్ రెండు మూడు వారాలకు పరిమితం కాదు.
రెండు దశాబ్దాల ముందు మన దగ్గర 50-100-175 రోజులు ఆడిన పరిస్థితులే ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రన్ ఇంతటితో ముగిసిపోదు. అది ఇంకో రెండు మూడు నెలల పాటు బాగా ఆడేలానే ఉంది. కాబట్టి ‘ముత్తు’ రికార్డు బద్దలు కావడం లాంఛనమే కావచ్చు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…