Rx 100 Director Ajay
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాడు అజయ్ భూపతి. వర్మ శిష్యుడి సినిమా అంటే కొన్నేళ్ల నుంచి ఆయన తీస్తున్న లో లెవెల్ సినిమాల్లాగే ఉంటుందని అనుకున్నారు.ఈ సినిమా ప్రోమోలు కూడా కొంచెం తేడాగానే అనిపించాయి. కానీ విషయం ఉన్న సినిమా కావడం, అందులో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్విస్టు బ్రహ్మాండంగా పేలడంతో ప్రేక్షకులకు మంచి కిక్కు వచ్చింది. సినిమా బ్లాక్బస్టర్ అయింది. అజయ్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.
అతడి రెండో సినిమా ‘మహాసముద్రం’కు మంచి హైపే వచ్చింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్.. ఇలా మంచి కాస్ట్ కుదిరింది. పెద్ద బడ్జెట్లో సినిమాను నిర్మించారు. కానీ అన్నీ ఉన్నా సినిమాలో అసలు విషయం తేడా కొట్టడంతో అజయ్ ఒకేసారి దబేల్మని కింద పడ్డాడు. ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయిన అజయ్కి మళ్లీ ఇంకో సినిమా దక్కించుకోవడం కష్టమే అయింది.
ఐతే ఇప్పుడు అజయ్ స్వీయ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తన మిత్రులతో కలిసి అతను ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ‘మంగళవారం’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. రెండో సినిమాలా కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా.. తొలి చిత్రం మాదిరి ప్రయోగాత్మక శైలిలో ఈ సినిమా చేయాలని అజయ్ ఫిక్సయ్యాడట.
ఇందులో ముఖ్య పాత్రలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయట. ఆర్టిస్లుల వివరాలు అయితే ఏమీ వెల్లడి కాలేదు. ‘మంగళవారం’ అనే టైటిల్ అనగానే ఈ సినిమాపై రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మంగళవారాన్ని కొందరు అశుభ సూచకంగా భావిస్తారు. ఆ రోజు ఏ పనీ చేయరు. కొందరేమో అది మంగళకరమైన రోజు కాబట్టి ఆ పేరు పెట్టారని సానుకూల ధోరణితో చూస్తారు. ఇక ‘మంగళవారం’ మీద ఒక బూతు సామెత కూడా ఉంది. మరి అజయ్ ఏ కోణంలో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారన్నది ఆసక్తికరం.
This post was last modified on November 17, 2022 4:36 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…