Rx 100 Director Ajay
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాడు అజయ్ భూపతి. వర్మ శిష్యుడి సినిమా అంటే కొన్నేళ్ల నుంచి ఆయన తీస్తున్న లో లెవెల్ సినిమాల్లాగే ఉంటుందని అనుకున్నారు.ఈ సినిమా ప్రోమోలు కూడా కొంచెం తేడాగానే అనిపించాయి. కానీ విషయం ఉన్న సినిమా కావడం, అందులో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్విస్టు బ్రహ్మాండంగా పేలడంతో ప్రేక్షకులకు మంచి కిక్కు వచ్చింది. సినిమా బ్లాక్బస్టర్ అయింది. అజయ్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.
అతడి రెండో సినిమా ‘మహాసముద్రం’కు మంచి హైపే వచ్చింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్.. ఇలా మంచి కాస్ట్ కుదిరింది. పెద్ద బడ్జెట్లో సినిమాను నిర్మించారు. కానీ అన్నీ ఉన్నా సినిమాలో అసలు విషయం తేడా కొట్టడంతో అజయ్ ఒకేసారి దబేల్మని కింద పడ్డాడు. ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయిన అజయ్కి మళ్లీ ఇంకో సినిమా దక్కించుకోవడం కష్టమే అయింది.
ఐతే ఇప్పుడు అజయ్ స్వీయ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తన మిత్రులతో కలిసి అతను ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ‘మంగళవారం’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. రెండో సినిమాలా కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా.. తొలి చిత్రం మాదిరి ప్రయోగాత్మక శైలిలో ఈ సినిమా చేయాలని అజయ్ ఫిక్సయ్యాడట.
ఇందులో ముఖ్య పాత్రలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయట. ఆర్టిస్లుల వివరాలు అయితే ఏమీ వెల్లడి కాలేదు. ‘మంగళవారం’ అనే టైటిల్ అనగానే ఈ సినిమాపై రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మంగళవారాన్ని కొందరు అశుభ సూచకంగా భావిస్తారు. ఆ రోజు ఏ పనీ చేయరు. కొందరేమో అది మంగళకరమైన రోజు కాబట్టి ఆ పేరు పెట్టారని సానుకూల ధోరణితో చూస్తారు. ఇక ‘మంగళవారం’ మీద ఒక బూతు సామెత కూడా ఉంది. మరి అజయ్ ఏ కోణంలో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారన్నది ఆసక్తికరం.
This post was last modified on November 17, 2022 4:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…