Movie News

మహేష్‌‌ని నింధించడం కరక్టేనా?

సూపర్ స్టార్ కృష్ణ దహనసంస్కారాలు ఒక ప్రైవేట్ ల్యాండ్‌లో చేయలేదని, ఒక చిన్నపాటి మెమోరియల్ కట్టిస్తే బాగుంటుందని అనడం వేరు, ఎవరు చెప్పినా వినకుండా మహేష్‌ బాబు అలా కానిచ్చేశాడు అంటూ ఇప్పుడు కొంతమంది నిప్పులుకక్కుతున్న సంగతి తెలిసిందే. రేపోమాపో ఇదో పెద్ద న్యూస్ చానల్లో ప్రైమ్ డిబేట్‌గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే తన తండ్రిని ఎక్కడ ఖననం చేయాలి, తదుపరి ఏం చేయాలి అనే విషయంలో మహేష్‌ బాబుకు సొంతంగా నిర్ణయం తీసుకునే ఛాన్సే లేదన్నట్లు ఎద్దేవా చేయడం కరక్టేనా?

నిజానికి హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించుకున్న ఈ పాతతరం సినిమా పెద్దలు చనిపోతే.. దాదాపు అందరూ స్టూడియోల్లోనే అంత్యక్రియులు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్, రామానాయుడు స్టూడియోలో రామానాయుడు సమాధిని కట్టించి స్మృతిచిహ్నాలను కూడా ఏర్పాటు చేశారు.

మరి కృష్ణగారికి కూడా అదే తరహా గౌరవం ఇవ్వాలంటే పద్మాలయ స్టూడియోస్ లో అంత్యక్రియలు చేసుండాల్సింది. కాని దానిని ఎప్పుడో అమ్మేశారు కాబట్టి, ఇప్పుడు అక్కడ కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. పైగా అది కూడా కొన్ని ల్యాండ్ మ్యుటేషన్ తాలూకు లీగల్ చిక్కుల్లో ఉందంటూ అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ వస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్లతో దున్నించడమే కాదు, జీ-గ్రూప్‌కు ఇచ్చేసిన పద్మాలయ భూములను లాక్కుంటాం అంటూ అప్పట్లో ఇప్పటి సిఎం కెసిఆర్ అలాగే ఎమ్మెల్యే హరీశ్ రావ్ లు పెద్ద ఎత్తునే శపథాలు కూడా చేశారు. మరి అలాంటి ఇష్యూ ఏమన్నా ఉండటం వలన ఇప్పుడు కృష్ణ గారి అంత్యక్రియలను పద్మాలయలో మిగిలిన భూమిలో చేయలేదా అనే విషయం కూడా ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు.

ఇకపోతే తన తండ్రిని ఎక్కడ ఖననం చేయాలి, ఎక్కడ సమాధి కట్టాలి అనేది పూర్తిగా మహేష్‌ వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన తండ్రి. మనకి సూపర్ స్టార్ అయినా కూడా, ఆయనకు ముందు తండ్రి. కాబట్టి ఆ విషయంలో ఇతరులు అవాకులు చివాకులు పేలడం కరక్ట్ కాదు. హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే, మనిషిని ఖననం చేయాల్సిందే. అది కూడా అందరినీ దహనం చేసే ఆ స్మశానవాటికలో చేసినప్పుడే.. అందరూ సమానం అనే ఫీలింగ్ వస్తుంది. ఏమో, మహేష్‌ ఆ విధంగా ఆలోచించి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపాడేమో, తెలియదు కదా. బాలీవుడ్ లో రిషి కపూర్ వంటి లెజెండ్స్ అంత్యక్రియలు కూడా కామన్ స్మశానవాటికల్లోనే జరిగాయి. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా రచ్చ చేయడం కరక్ట్ కాదు.

This post was last modified on November 17, 2022 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

10 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

12 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

12 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

13 hours ago